Home » Duddilla Sridarbabu
వరుసగా తెలంగాణలో చోరీలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ ఉండే రాజకీయ నాయకుల ఇంట్లోనే చోరీలు జరగడంతో సామాన్యల పరిస్థితి ఎంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈచోరీ విషయం స్థానికులకు తెలియడంతో వారు భయాభ్రాంతులకు గురవుతున్నారు. దొంగలను పట్టుకుని రక్షణ కల్పించాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు.
Telangana: జగిత్యాల జిల్లాలో జరిగిన హత్య ఉదంతంపై మంత్రి శ్రీధర్ బాబు రెస్పాండ్ అయ్యారు. హత్య చేసిన, చేయించిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అలాగే పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటామని వెల్లడించారు.
మీసేవ ఆపరేటర్ల కమీషన్ పెంపుపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, త్వరలో కొత్త కమీషన్ విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
అసఫ్ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
ఆవిష్కరణలతో పాటు వర్ధమాన సాంకేతికతల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు.
జిల్లాలకు ఐటీ సేవలను విస్తరించాలని కాంగ్రెస్ సర్కార్ ప్రణాళిక రచిస్తోంది. స్టార్టప్ కంపెనీలు జిల్లాలకు వెళ్లే ఆలోచన ఉంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రాయితీలు ఇస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ ఎక్కడ కాకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పుణ్యక్షేత్రాల్లో కల్తీ అసలే కాకూడదని చెప్పారు. పుణ్య క్షేత్రాల్లో రాజకీయాలకు తావు లేదని చెప్పారు. లడ్డూ విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
సచివాలయం ముందు రాజీవ్గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
కోచింగ్ కేంద్రాలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థుల భద్రత, ఫీజుల వసూలు వంటి విషయాల్లో ఒక చట్టపరమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
Telangana: పీఏసీ చైర్మన్గా అరికపూడి గాంధీ నియామకం పట్ల మంత్రి శ్రీధర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడిని పీఏసీ చైర్మన్గా నియమించినట్టు అర్థం చేసుకుంటున్నామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో, రూల్ బుక్ ప్రకారమే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నామన్నారు.