Home » DSC
మెగా డీఎస్సీ-2025 నిర్వహణపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు ఉపాధ్యాయులు సూచించారు. ఈ డీఎస్సీ నిర్వహణపై జరుగుతున్న దుష్ప్రచారాలను వారు ఖండించారు.
గత ఎన్నికల్లో వైసీపీని నిరుద్యోగ యువత 11 సీట్లకే పరిమితం చేసిందన్న అక్కసుతోనే వారిపట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా యువత తిరుగుబాటు చేయాలని శాప్ ఛైర్మన్ రవి నాయుడు పిలుపునిచ్చారు.
AP DSC పరీక్షల నిర్వహణ, ఫలితాలపై వస్తున్న వివాదాలు, అభ్యర్థుల అనుమానాలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పందించారు.
డీఎస్సీ నిర్వహణపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో చేపట్టామని తెలిపారు.
ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను మోసం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడికి గతంలోనూ ఉద్యోగాల పేరుతో మోసాలు చేసిన చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.
డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 2,500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.
ఈడీ చేశారు. డీఎస్సీ కోసం ఆరేళ్లకుపైగా ఎదురు చూశారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించాలన్న నిర్ణయం.. ఉమ్మడి జిల్లాలోని 1403 మంది జీవితాల్లో వెలుగునింపింది.
తన ప్రొఫెసర్ డీఎల్ నారాయణ తనని ప్రోత్సహించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రోత్సహంతోనే యూనివర్సిటీ నుంచి రాజకీయల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యానని వివరించారు.
ఎమ్మెల్యేగా గెలిచాక తనకు ఏ శాఖ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే.. విద్యాశాఖ కావాలని చెప్పినట్లు లోకేశ్ పేర్కొన్నారు. యూనియన్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయని అన్నారని.. అయినా అదే శాఖ కావాలని కోరినట్లు చెప్పారు.
స్పోర్ట్స్ అథారిటీ అవసరమైన రీవెరిఫికేషన్ లిస్టులు ఇవ్వకపోవడం వల్లే ఈ ఆలస్యం జరిగిందని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల రీవెరిఫికేషన్ లిస్టును ఇవ్వాలని పలుమార్లు స్పోర్ట్స్ అథారిటీకి లేఖలు రాసినట్లు ఆయన ఆధారాలను సమర్పించారు.