Home » Droupadi Murmu
ప్రగతి లక్ష్యాల దిశగా భారతదేశం నిజమైన ప్రయాణం సాగిస్తోందని, అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదుగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
నూతన సంవత్సరం 2025లో ప్రజలందరికీ ఆనందం, సామరస్యం, శ్రేయస్సు కలగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. భారతదేశంతోపాటు ప్రపంచానికీ ప్రకాశవంతమైన, సమగ్రమైన, స్థిరమైన భవిష్యత్తును సృష్టించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
వివిధ రంగాల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి, అద్భుత విజయాలు సాధించిన 17 మంది చిన్నారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా గురువారం ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అందుకున్నారు.
దేశంలో సాంకేతికంగా అధునాతన పరికరాలను తయారు చేయడం ద్వారా రక్షణ ఉత్పత్తుల్లో స్వాలంబన సాధించే దశను ప్రారంభించే సమయం వచ్చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్న భవనాన్ని 1860లో నిజాం నవాబు నజీరుద్దౌలా నిర్మించారు. సాలర్జంగ్ ప్రధానిగా ఉన్న సమయంలో బొల్లారం(Bollaram) నిజాం ప్రభుత్వం అధీనంలోని ఒక కంటోన్మెంట్(Cantonment) ప్రాంతంగా ఉండి, ప్రధాన సైనికాధికారి నివాసంగా ఉండేది.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17న హైదరాబాద్కు రానున్నారు. 21వ తేదీ వరకు ఆమె ఇక్కడే ఉండనున్నారు. 17న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆమె నగరానికి చేరుకుంటారు.
భారత రాజ్యాంగం ప్రత్యక్ష, ప్రగతి శీల పత్రం వంటిదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ ప్రాంగణంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ వేడకుల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
పురాతన కాలం నుంచే భారతీయ సైద్ధాంతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, భారతీయుల మత విశ్వాసాలు, కళలు, సాంకేతిక పరిజ్ణానం, భాష, సాహిత్యం విశ్వవ్యాప్తంగా గౌరవం పొందాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
భారతీయ సనాతన ధర్మం ఎంతో ఉన్నతమైనదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. రాతిలోనూ ప్రాణిలోనూ.. అలాగే గాలి, నీరు, నింగి, నేల, నిప్పులోనూ భగవంతుడిని చూస్తామని.. ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగర్ వేదిక కానుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమైంది.