Home » Droupadi Murmu
మహాకుంభ్ మేళాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన సుమారు 8 గంటల సేపు జరుగుతుంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. తొలుత సంగమ స్నానం, అనంతరం అక్షయ్వత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజ, దర్శనంలో పాల్గొంటారు.
సోనియాగాంధీ వ్యాఖ్యలు గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు పవిత్రత, నిబంధనల పరిరక్షణకు, ప్రజాస్వామ్య సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ను కోరారు.
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై బీహార్ ముజఫర్పూర్ జిల్లాలోని ఓ కోర్టులో శనివారం ఫిర్యాదు దాఖలైంది. దేశ అత్యున్నత రాజ్యాంగ అధికారాన్ని అగౌరవపరిచినందుకు సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ముజఫర్పూర్కు చెందిన న్యాయవాది సుధీర్ ఓజా ఫిర్యాదు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విషయంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖల పట్ల కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి కార్యాలయం గౌరవాన్ని నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని ఖర్గే పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగో లేదని చెప్పేందుకు ఆమె వాడిన "పూర్ థింక్'' అనే పదాన్ని వక్రీకరించి బీజేపీ నేతలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
ఢిల్లీలోని ద్వారకలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, ద్రౌపది ముర్ము ఒక గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, ఆమెను అవమానించడం దేశంలోని 10 కోట్ల మంది గిరిజనులను అవమానించడమేనని అన్నారు.
దేశ అత్యున్నత కార్యాలయం హోదాను తగ్గించేలా సోనియాగాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆ మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
మహా కుంభమేళా తొక్కిసలాట ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. మరణించిన భక్తుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.
భారతదేశం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే, ఈసారి కూడా, భారతదేశ సైనిక శక్తి, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథంలో ప్రదర్శిస్తున్నారు.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఢిల్లీలో దేశ ప్రజలకు నాయకత్వం వహించనున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు కావడంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో ఈసారి గణతంత్ర వేడుకలు ప్రత్యేకంగా జరగనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.