Home » Dola Sree Bala Veeranjaneya Swamy
చంద్రబాబు నాయుడు కేబినెట్లోని పలువురు మంత్రుల పట్ల కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మధ్య జరిగిన సంభాషణల్లో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మహిళలందరికీ ఆర్టీసీ(RTC)లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) తెలిపారు. ఉచిత ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. ఒంగోలు బస్టాండ్లో ఐదు నూతన బస్ సర్వీసులను మంత్రి డోలా ప్రారంభించారు.
గుంటూరు జిల్లా వినుకొండ (Vinukonda)లో జరిగిన హత్యను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం సిగ్గుచేటని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి(Minister Veeranjaneya Swamy) అన్నారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను రాజకీయం చేయడం ఆయనకే చెల్లుతుందని మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాయుడుపేట(Naidupeta) గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై గూడూరు(Gudur) ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి చెప్పారు.
Andhrapradesh: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి హుటాహుటిన జిల్లాకు బయలుదేరారు. తిరుపతి జిల్లా నాయుడపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న(ఆదివారం) కలుషిత ఆహారం వల్ల పాఠశాలలోని దాదాపు 150 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
పొదిలి(Podili) ప్రాంతీయ వైద్యశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి(Social Welfare Minister) డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Dola Sree Bala Veeranjaneya Swamy) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్య సిబ్బంది తీరుపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసి నెల రోజులు గడిచినా ఆస్పత్రి ఆవరణలోని శిలాఫలకంపై ప్రభుత్వ రాజముద్ర ఏర్పాటు చేయకపోవడం, గత ముఖ్యమంత్రి జగన్, అప్పటి ఎమ్మెల్యే ఫొటోలు ప్రచురించడంపై మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకటి రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి దోలా బాల వీరాంజనేయ స్వామి (Veeranjaneya Swamy) కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అమరావతి: టీడీపీ నేత డోలా బాల వీరాంజనేయస్వామి, సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖా మంత్రిగా బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్లో మంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.
విశాఖ రుషికొండ(Rushikonda)పై నిర్మించిన భవనాలను ఎన్డీయే ప్రభుత్వం(NDA government) కచ్చితంగా ఉపయోగించుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి (Minister Dola Veeranjaneya swamy) స్పష్టం చేశారు. భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పుకొచ్చారు.
వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి (Minister Bala Veeranjaneya Swamy) తెలిపారు.వారి నుంచి పెద్దఎత్తులో వస్తున్న మెయిల్స్, వాట్సప్ మెసేజ్లతో తన ఫోన్ నిండి పోయిందని చెప్పారు.