Home » DMK
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, కేబినెట్ మంత్రి, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలపై ఆయన శనివారం స్పందించారు. ''డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలే'' అని నవ్వుతూ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న మూడు క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ తమిళనాడులోని డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎస్ భారతి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) శతజయంతి వేడుకల సందర్భంగా రూ.100 విలువైన స్మారక నాణేలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు.
కళ్లకుర్చి కల్తీసారా సంఘటనతో తనకు, తన వర్గానికి సంబంధాలున్నాయంటూ తప్పుడు ఆరోపణలు చేసిన డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్ఎస్ భారతిని జైలుకు పంపి తీరుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) శపథం చేశారు.
తన నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం గత మూడేళ్లుగా అమలు చేస్తున్న మూడు పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం వల్లనే ఇంగ్లాండులో లేబర్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురం కల్తీసారా మృతుల సంఖ్య శుక్రవారం 52కు పెరిగింది. మరో 112 మంది బాధితులు పుదుచ్చేరి, విల్లుపురం, కళ్లకుర్చి, సేలం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry) ప్రభుత్వంలో అసమ్మతి రేగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నమశ్శివాయం పరాజయం ఈ కూటమిలో చిచ్చు రేపుతోంది.
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినట్టుగానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్(Minister Udayanidhi Stalin) జోస్యం చెప్పారు.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు.
రాష్ట్రంలో దశాబ్దాలుటా డీఎంకేకు వంతపాడుతుంటే కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చెందగలదని, తెలంగాణా మాజీ గవర్నర్, సౌత్ చెన్నై లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(Dr. Tamilisai Soundararajan) ప్రశ్నించారు.