Home » DMK
తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమాచార సాధానాలకు చేతినిండా పని కల్పిస్తున్నారు. అలాగే మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల సమరం కూడా జరగనుండడంతో అన్ని పార్టీలు సిద్దమతున్నాయి. దీంతో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.
ఒక్క నోటిమాట ఆయన పదవికే ఎసరు తెచ్చింది. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు ఊరికే చెప్పలేదు కాబోలు. పార్టీ పదవిని చేపట్టిన 24 రోజుల్లోనే డీఎంకే ధర్మపురి తూర్పు జిల్లా కార్యదర్శి పి.ధర్మసెల్వన్ను ఆ పదవి నుండి పార్టీ అధిష్టానం తొలగించింది.
టాస్మాక్ అవినీతిని ఖండిస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటిని ముట్టడించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టాస్మాక్ సంస్థలో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
హిందీ భాషా వివాదం క్రమంగా ముదురుతోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే నేతలు తీవ్రంగా స్పందించారు. అయితే ఏం అన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డీెఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగం కేంద్ర ప్రభుత్వ శాఖగా పనిచేస్తోందంటూ ఆమె విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీశాయి.
ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసపూరితంగా ఉందని ఆయన విమర్శించారు.
లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే త్రిభాషా విధానంపై స్టాలిన్ వదంతులు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. కాగా, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని డీఎంకే కొట్టివేసింది.
ప్రముఖ సినీనటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. శుక్రవారం చెన్నైలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా.. ప్రస్తుత రాజకీయాలు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్ర ఎంకే స్టాలిన్ మరోసారి మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యావిధానం ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేది కాదని, అది పూర్తిగా కాషాయ విద్యావిధానమంటూ.. అందుకే దానిని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసే ప్రసక్తే లేదని
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. కొత్తగా పెళ్ళిచేసుకునే దంపతులు వెంటేనే పిల్లల్ని కనండి, కానీ ఎక్కవ మందిని కనొద్దటూ.. పేర్కొన్నారు. అంతేగాక రాష్ట్రంలో బీజేపీ నాయకులు పసలేని విమర్శలు చేస్తున్నారని కూడా ఉదయనిధి అన్నారు.