Home » DMK
రానున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే(DMK) కూటమి 200 నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించాలని, అదే తమ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు. తేనాంపేట డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం కలైంజర్ అరంగంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే దిశగా డీఎంకే సన్నాహాలను చేపడుతోంది.
టీవీకే విధానాలని చెప్పుకుంటున్నవన్నీ తమ పార్టీ విధానాలేని, తమను చూసి కాపీ కొట్టినవేనని డీఎంకే నేత టీకేఎస్ ఇలాంగోవన్ మీడియాతో మాడ్లాడుతూ అన్నారు. ఆయన (విజయ్) చెప్పినవన్నీ గతంలో తాము చెప్పినవేననీ, తాము ఏదైతే చెప్పామో దానినే పాటిస్తున్నామని చెప్పారు.
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడులో లోక్సభ స్థానాలు తగ్గే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు గవర్నర్ను వెంటనే రీకాల్ చేయాలని సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట రైల్వేస్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైల్వేస్టేషన్లో లూప్లైన్లో ఆగివున్న గూడ్సు రైలును మైసూరు నుంచి దర్భంగాకు వెళ్తున్న బాగ్మతి ఎక్స్ప్రెస్ వెనుక నుంచి ఢీకొంది.
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయ్ నిధి స్టాలిన్పై పరోక్ష విమర్శలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పవన్ వ్యాఖ్యలపై ఉదయ్నిధి స్టాలిన్తో పాటు డీఎంకే నేతలు స్పందిస్తున్నారు. ఉదయ్నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు..
తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా డీఎంకే అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు.
కోయంబత్తూరులో ఇటీవల జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో జీఎస్టీ లోపాలను ఎత్తిచూపిన హోటల్ యజమాని పట్ల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వైఖరి గర్హనీయమని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎస్.జగద్రక్షకన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ కేసులో ఆయనకు, ఆయన కుటుంబానికి రూ.908 కోట్ల జరిమానా విధించింది.