Home » DK Shivakumar
ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిని అంటూ సిద్దరామయ్య ఢిల్లీ వేదికగా పదే పదే ప్రకటించినా అధిష్ఠానానికి చెందిన ముఖ్యులు ఎవరూ స్పందించకపోవడం, పైగా గతంలో మాదిరిగా ఎవరూ నాయకత్వ మార్పు గురించి మాట్లాడరాదని హుకుం జారీ చేసిన అగ్రనేతలు ఈ అంశమే మాకు సంబంధం లేదనేలా ఉండడంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్ ఒక్కసారిగా దిగాలు పడ్డారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని నెలల్లోనే మార్పులు ఉంటాయని, అందులో ప్రధానంగా నాయకత్వ మార్పు ఉంటుందనే అంశం కొన్ని నెలలుగా హల్చల్ చేస్తోంది.
కర్నాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. కర్నాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగాహానాలను కొట్టిపారేశారు..
చన్నపట్టణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్కు వ్యతిరేకంగా భార్య, కుమార్తెలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలాను వారు భేటీ అయ్యారు.
కాంగ్రెస్లో ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిని మార్చేందుకు డిల్లీ కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. సీఎం సిద్దరామయ్య పదవి నుంచి దిగినా డీకే శివకుమార్ సీఎం అయ్యేందుకు సిద్దరామయ్య మద్దత్తు ఇవ్వడు.
ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల తేల్చిచెప్పారు. డీకే, తానూ కలిసి పనిచేస్తున్నామని, పార్టీ ఐక్యంగా ఉందని చెప్పారు. డీకే శివకుమార్ సైతం తనకు మరో దారి లేదని, అధిష్ఠానం నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.
ఇదే ఏడాది అక్టోబరు లేదా నవంబరులో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కానీ మరో మూడేళ్లు సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారంటే ఇది గ్యారెంటీగా ప్రతిపక్షనేత అశోక్(Ashok) ఎద్దేవా చేశారు.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను సీఎంను చేయమని ఎవరినీ అడగలేదని, నాయకత్వ మార్పు అంశంపై బహిరంగ ప్రకటన చేసే వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఇన్చార్జి రణ్దీప్ సూర్జేవాలా రాష్ట్రానికి రావడంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై సూర్జేవాలా దృష్టి సారించనున్నట్టు చెప్పారు. పార్టీని పటిష్టం చేయడం కోసం వచ్చారని, ఆయన పని ఆయన చేస్తారని తెలిపారు.
రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్ నేతల అసంతృప్తి పెరుగుతోంది. ఐదు గ్యారెంటీలతో గ్రాంట్లు లభించడం లేదని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలు మరింత ముందుకే వెళ్తున్నారు. ప్రభుత్వంలో పనులు కావాలంటే... డీసీఎం డీకే శివకుమార్కు జై అనాల్సిందే అనిపిస్తోందని బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ఆగ్రహం వ్యక్తం చేశారు.