Home » DK Shivakumar
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు భారీ షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నాయి తాజా పరిణామాలు. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్(Congress) పార్టీ శుక్రవారం దేశవ్యాప్తంగా 39 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా రాష్ట్రం నుంచి ఏడుగురికి చోటు దక్కింది.
కర్ణాటక కాంగ్రెస్లో(Congress) ప్రస్తుతం వింత పరిస్థితి నెలకొంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించడంతో కర్ణాటకలోనూ అత్యధిక ఎంపీ స్థానాల్లో పాగా వేస్తామని అప్పట్లో నేతలు ధీమా వ్యక్తం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేతలెవరూ పోటీ చేయడానికి ముందడుగు వేయట్లేదని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది.
బెంగళూర్ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. నగరంలో గల అపార్ట్ మెంట్స్, ఇళ్లలో ఉన్న బోర్ల నుంచి నీరు రావడం లేదు. గత కొన్నిరోజుల నుంచి ఈ సమస్య ఉంది. నిత్యవసర అవసరం అయిన నీటిని కొందరు వ్యాపారంగా మారుస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు తరలిస్తూ దోచుకుంటున్నారు. ఇదే అంశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు.
మనీ ల్యాండరింగ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2018 మనీ ల్యాండరింగ్ కేసును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద డీకే శివకుమార్పై మోపిన అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ అనురుద్ద బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 10లోగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలోనే సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్(CM Siddaramaiah, DCM DK Shivakumar)లు ఢిల్లీ వెళ్లనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కర్ణాటక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీచేసింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు సమన్లు ఇచ్చింది. గత కర్ణాటక ప్రభుత్వం 40 శాతం కమీషన్లు తీసుకుంటుందని ముగ్గురు నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కన్నడ రాజకీయాలు కాక రేపుతున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. అటు ఢిల్లీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపబడుతుంటే.. అందుకు కౌంటర్గా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీతో పాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజున కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) సమర్థించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మా భక్తి.. మా గౌరవం, మా మతం.. మేం వాటిని ప్రచారం చేయము.
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లే విషయంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టత ఇచ్చారు. ఈనెల 22న జరిగే రామ్లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు కానీ, ముఖ్యమంత్రికి కానీ ఇంతవరకూ ఆహ్వానం రాలేదని చెప్పారు.