Home » DK Shivakumar
వర్షాభావ పరిస్థితులకు తోడు జలాశయాల్లో నీటి మట్టం అడుగంటుతుండటంతో కావేరీ జలాల్ని(Cauvery Water) తమిళనాడుకి విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడటానికి ఆయన ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లోక్సభ ఎన్నికల్లో తక్కువసీట్లు సాధించడంపై అధిష్ఠానం నిజనిర్ధారణ కమిటీని పంపింది. పార్టీ సీనియర్ నేత మధుసూధన్ మిస్త్రీ నేతృత్వంలోని కమిటీ బెంగళూరుకు వచ్చారు.
లోక్సభ ఎన్నికల్లో ఆశించిన వాటి కంటే తక్కువ స్థానాలు దక్కడంపై ఆత్మ విమర్శ చేసుకుంటామని, ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటామని కేపీసీసీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) పేర్కొన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మరెంత కాలం ప్రాణం ఉంటుందోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) ఎద్దేవా చేశారు. ప్యాలెస్ మైదానంలో బీజేపీ రాష్ట్ర ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన విజయేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాపాలలో మునిగిపోయిందని విమర్శించారు.
సిద్ధరామయ్యను పక్కకుపెట్టి డీకే శివకుమార్కు పగ్గాలు అప్పగిస్తారని హైకమాండ్ సైతం ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నదని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
లోక్సభ ఎన్నికల సందర్భంగా అంతా సమైక్యంగా ఉన్నామనేలా కనిపించిన కాంగ్రెస్ నాయకుల మధ్య ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఎవరికివారుగా చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వంలో కీలక సారథుల మధ్య ఎత్తులు పైఎత్తులు సాగుతున్నాయి. ఏడాది పాలన ముగియడం, లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో మళ్లీ ముసుగు రాజకీయాలు తీవ్రమవుతున్నాయి.
ఈవీఎంల కారణంగానే జేడీఎస్, బీజేపీలకు ఆశించినంతకంటే ఎక్కువ లోక్సభ స్థానాలు వచ్చాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) ఆరోపించారు. బీబీఎంపీ కార్యాలయంలో గ్యారెంటీల అమలు కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం ఓటమికి వ్యక్తిగతంగా తనదే బాధ్యత అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) తెలిపారు. నగరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బెంగళూరు గ్రామీణ నుంచి తన తమ్ముడు డీకే సురేశ్(DK Suresh) ఓటమికి తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నా అన్నారు.
శక్తి గ్యారెంటీ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించడంతో మెట్రో ఆదాయం తగ్గిందని ప్రధానిమోదీ వ్యాఖ్యానించడం బాధాకరమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు.