Home » Diwali
దీపావళి కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఈ పండుగ సామాన్య ప్రజలకే కాకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లో ముహూరత్ ట్రేడింగ్ చేసే సంప్రదాయం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
పండగల వేళ.. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ఇస్తూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దీపాల పండగ.. దీపావళి. ఈ పండగ మరికొద్ది రోజుల్లో రానుంది. ఈ పండగను పురస్కరించుకుని సెల్ ఫోన్ల కంపెనీలు భారీగా ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. అయితే దీపావళి సేల్.. అక్టోబర్ 20వ తేదీ రాత్రి నుంచి ఫ్లిప్కార్డ్లో ప్రారంభమవుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) దీపావళి సమయంలో తీపి కబురు చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించారు.
లక్ష్మీ దేవితోపాటు కుబేరుడిని సైతం భక్తులు పూజిస్తారు. ఇంకా చెప్పాలంటే దీపావళికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. ధనత్రయోదశికి సైతం అంతే ప్రాముఖ్యత ఉంది. అయితే దీపావళి రోజు కొన్ని యోగాలు ఏర్పడనున్నాయి. దీని వల్ల కొన్ని రాశుల వారికి దశ తిరగనుంది.
ఓ కంపెనీ యజమాని దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చాడు. షాక్ అంటే ఏదో ఉద్యోగం నుంచి తీసిపడేశారని మాత్రం అనుకోవద్దు. కళ్లు చెదిరిపోయే గిప్టులతో ముంచెత్తాడు.
దీపావళి, చాత్ పూజ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే మంగళవారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు మళ్లీ స్వస్థలాలకు చేరేందుకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడతాయని తెలిపింది.
Bank Holidays in October 2024: టెక్నాలజీ పెరిగింది. ఆర్థిక లావాదేవీలన్నీ అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ఫోన్లోనే పూర్తి చేస్తున్నారు ప్రజలు. డబ్బులు పంపాలన్నా.. డబ్బులు పొందాలన్నా.. యూపీఐ పేమెంట్స్తో నిమిషాల్లో పని పూర్తైపోతుంది. అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు తమ పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది.
రానున్న దసరా, దీపావళి, ఛాట్ ఫెస్టివల్స్(Dussehra, Diwali, Chat Festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి 48 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
పండుగకు ఎప్పుడు వస్తున్నావ్ నాన్నా..?? ఏమో తెలియదు.. రైళ్లు ఖాళీలేవమ్మా... దసరా, దీపావళి(Dussehra and Diwali) పండగలు సమీపిస్తుండడంతో హైదరాబాద్(Hyderabad) నుంచి స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్న వారు తమ కుటుంబసభ్యులతో జరుపుతున్న సంభాషణ ఇదే.
పెరుగుతున్న వాయు కాలుష్యం(Air Pollution) దేశంలోని అభివద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాలకు సవాలు విసురుతోంది. ఏటా వాయుకాలుష్యం బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.