Home » Districts
ప్రాణాపాయ స్థితిలో ఉండేవారిని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తున్న 108తోపాటు.. గ్రామీణ ప్రజల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న 104 సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు నెలల నుంచి వీరికి వేతనాలు అందడం లేదు. వచ్చేది తక్కువ వేతనం. అదీ నెలనెలా అందడం లేదు. తాజాగా నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ తప్పుకోవడంతో బకాయి వేతనాలు వస్తాయో ...
మండల పరిధిలోని కొత్తపల్లి వద్ద ఉన్న సప్తగిరి క్యాంపర్ పరిశ్రమలో ఆర్-3 రియాక్టర్కు మరమ్మతులు చేస్తుండగా విష వాయువులు వెలువడ్డాయి. వెల్డింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. రియాక్టర్ నుంచి వెలువడిన ఐసో బ్రొనైల్ అసిటేట్ వాయువును పీల్చిన ఆరుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది
వైద్యం కోసం వచ్చిన రోగులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. పదుల సంఖ్యలో బాధితులు క్యూలో నిలబడ్డారు. ఓపీ చీటీలు రాసేచోట, వైద్య పరీక్షలు నిర్వహించేచోట, చివరకు వైద్యుల వద్ద కూడా రద్దీ ఉంది. వారికి సకాలంలో సేవలు అందించాల్సిన ఆస్పత్రి సిబ్బంది.. సెల్ఫోనలో మాట్లాడుతూ బిజీగా కనిపించారు. గుత్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆంధ్రజ్యోతి సోమవారం విజిట్ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి రోజూ...
చీకటి పడ్డ తరువాత దంచికొట్టిన వాన.. తెల్లవారేలోగా కాలనీలను ముంచెత్తింది. అనంతపురంలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతానికి తోడు.. కనగానపల్లి చెరువు తెగిపోవడం, ఆ మండలంలో కురిసిన దాదాపు 20 సెంటీమీటర్ల కుండపోత పండమేరుకు చేరడంతో జనం బెంబేలెత్తిపోయారు. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి పరిధిలోని జగనన్న కాలనీ, గురుదాస్ కాలనీ, ఆటోనగర్ ...
హిందూపురం మునిసిపల్ పీఠం కోసం ఆశావహులు ఆరాట పడుతుండగా, పట్టణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మునిసిపాలిటీలో 38వార్డులు ఉండగా 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 30 స్థానాలు, టీడీపీ ఆరు, ఎంఐఎం, బీజేపీ చెరోస్థానం గెలుచుకున్నాయి. 19వ వార్డు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన కౌన్సిలర్ ఇంద్రజకు చైర్పర్సన పదవిని అప్పగించారు. ఈమె మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ...
తుఫాను వర్షాలతో నల్లరేగడి నేలలు పదునయ్యాయి. దీంతో పప్పుశనగ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. తడి ఆరగానే విత్తనం వేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరో మూడు రోజులపాటు వర్షం కురవకపోతే విత్తనం వేస్తామని రైతులు అంటున్నా రు. ఇప్పటికే పలువురు రైతులు విత్తన పప్పుశనగ కొనుగోలు చేసి ఇళ్లలో సిద్ధంగా ఉంచు కున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1.18 లక్షల హెక్టార్లు కాగా, ఇందులో పప్పుశనగ 72 వేల హెక్టార్లలో సాగవుతుంది. మిగతా...
రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన కోసం ఎంతకైనా తెగించేవారు. ఇప్పుడు బిడ్డల చదువుల కోసం అంతకు మించి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. పల్లెటూరి తల్లిదండ్రులు చెమటను కరెన్సీ మూటలుగా మార్చి కార్పొరేటు విద్యాసంస్థలకు కట్టబెడుతున్నారు. తమలాగా పిల్లలు కష్టాలు పడకూడదన్న తాపత్రయం వారిది. ఈ ఆలోచనతో ఇంటికి, ఊరికి దూరంగా.. నగరాలకు తీసుకువెళ్లి హాస్టళ్లలో వదులుతున్నారు. అక్కడ ...
రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. సాగు చేసిన పంట చేతికందే వరకు కష్టంగా మారుతోంది. ఓవైపు చీడపురుగులు, రోగాలు మరోవైపు ప్రకృతి వైఫరీత్యాలు రైతన్నల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవలిగా కురుస్తున్న భారీ వర్షాలు రైతుల కంట నీరు తెప్పిస్తున్నాయి. ఖరీ్ఫలో బోర్లు, వర్షాధారంగా సాగుచేసిన పంటలు కోతకు వచ్చాయి. ప్రస్తుతం భారీ వర్షాలతో పండిన పంటను ఇంటికి తెచ్చుకోలేకపోతున్నారు. చేనులోనే పంటలు నీట మునుగుతున్నాయి. కోసిన పంటను నూర్పిడి చేసుకోలేక, ఆరబెట్టుకోలేక ...
జిల్లాలోని 28 మండలాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బొమ్మనహాళ్ మండలంలో 148.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. గార్లదిన్నె మండలంలో 75.8, రాయదుర్గం 75.6, పామిడి 62.2, డి. హీరేహాళ్ 59.8, బెళుగుప్ప 56.2, విడపనకల్లు 54.6, కణేకల్లు 54.0, కళ్యాణదుర్గం 50.4, శింగనమల 48.6, పెద్దవడుగూరు 40.6, గుమ్మఘట్ట 36.2, ...
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసేవారికి ఆనలైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఆనలైనలో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన వ్యాపారులకు శనివారం సర్వర్ సమస్య తలెత్తింది. ఆనలైనలో వివరాలను నమోదు చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా నాన రీఫండబుల్ రుసుం చెల్లించేందుకు ప్రయత్నిస్తే.. సాధ్యం కాలేదు. దీంతో వ్యాపారులు ...