• Home » District

District

UPADHI : ఇప్పుడేమంటారు?

UPADHI : ఇప్పుడేమంటారు?

కూలీలకు అందాల్సిన ఉపాధి సొమ్మును కొందరు స్వార్థపరులు బోగస్‌ మస్టర్ల ద్వారా తమ జేబుల్లో వేసుకున్నారు. జిల్లాలోని జాబ్‌కార్డులు, కూలీల ఆధారంగా 2 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉంది. అయితే జిల్లాకు 90లక్షలు పనిదినాలు మాత్రమే కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 61.30లక్షలు పనిదినాలు పూర్తి చేశారు. ఇందులో బోగస్‌ మస్టర్ల ద్వారా సుమారు 5లక్షల పనిదినాలు నమోదు చేసినట్లు సమాచారం. ఒక్కో పనిదినానికి రూ.220 చొప్పున 5 లక్షల పనిదినాలకు రూ.11కోట్లను ఉపాధి సిబ్బంది, గత వైసీపీ ప్రభుత్వంలోని కొందరు ...

COLLECTOR : అతిసారతో జాగ్రత్త

COLLECTOR : అతిసారతో జాగ్రత్త

జిల్లాలో అతిసార ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య, పంచాయతీ, జడ్పీ, ఐసీడీఎస్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ తదితర శాఖల అదికారులతో శనివారం సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామ, పట్టణ, నగర ప్రాంతాలలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించిందని అన్నారు. అతిసారపై మరింత అప్రమత్తంగా...

Yoga day : యోగాతో శాంతి.. సంతృప్తి

Yoga day : యోగాతో శాంతి.. సంతృప్తి

యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఖ్యాతి మన దేశానికి దక్కడం గర్వకారణమని అన్నారు. జిల్లా యువజన శాఖ, ఆయుష్‌, వివేకానంద యోగా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ...

YCP: ఇంకా స్వామిభక్తి..!

YCP: ఇంకా స్వామిభక్తి..!

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అధికారులు కూడా మారిపోతున్నారు. కానీ గృహనిర్మాణ శాఖలో మాత్రం కొందరు అధికారులు ఇంకా వైసీపీ సేవలో తరిస్తున్నారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారుల విషయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డికి చెందిన రాక్రీట్‌ సంస్థ గుట్టుగా వ్యవహారం నడిపిస్తోంది. లబ్ధిదారులపై ఒత్తిడి చేసి ఉపాధి బిల్లులు వసూలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆదేశాలను ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఏమాత్రం ఆలోచన చేయకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉద్యోగులను గ్రూపులుగా విభజించి మరీ వసూళ్లకు ఉసిగొల్పుతున్నారని సమాచారం. ...

Robbery : హైవేపై దోపిడీ

Robbery : హైవేపై దోపిడీ

మండల పరిధిలోని ఎనఎ్‌స గేటు వద్ద జాతీయ రహదారిపై దోపిడీ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. వాహన డ్రైవర్లపై రాళ్లు, బీరు బాటిళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. వారి వద్ద ఉన్న రూ.20 వేల నగదును దోచుకువెళ్లింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుందని రామగిరి సీఐ శివాంజ నేయులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు చెందిన డ్రైవర్లు మహేశ, శ్రీనివాస్‌, హైదరాబాద్‌కు చెందిన రవి.. హైదరాబాద్‌లోని ఓ షోరూం నుంచి ప్రైవేటు బస్సులను కేరళకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఎనఎ్‌స గేటు సమీపంలోని అమర నారాయణస్వామి ఆలయం వద్ద జాతీయ రహదారి పక్కన వాహనాలను ఆపి నిద్రపోయారు...

Inter-ministerial team : ఇదీ.. మా గోడు!

Inter-ministerial team : ఇదీ.. మా గోడు!

ఏ పంట పెట్టినా నష్టమే. వర్షాలే లేవు. పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు. ప్రభుత్వ పథకాలు సరిగా అందడం లేదు. ఉపాధి పని దినాలు కూడా సరిపోవడం లేదు. నలుగురైదుగురు ఉన్న కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కేటాయించారు. ఆ తరువాత పనులు ఇవ్వడంలేదు. దూర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు వెతుక్కుంటున్నాం. పంటలు లేవు.. పశుగ్రాసం లేదు. ప్రభుత్వం ఇచ్చే దాణామృతంలో నాణ్యత లేదు. గడ్డి, దాణామృతాన్ని బయట కొనాల్సి వస్తోంది. పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. తాగునీటికి బోర్లు వేస్తే ఉప్పునీరు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని ఆదుకోండి.....

Corporation : ఇద్దరూ ఇద్దరే..!

Corporation : ఇద్దరూ ఇద్దరే..!

అనంత నగరపాలిక ఇంజనీరింగ్‌ విభాగంలో ఇద్దరు మహిళా అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. విధి నిర్వహణలో వారి తీరు ఉన్నతాధికారులకు తలనొప్పి తెప్పిస్తోందట. బుద్ధిగా వేతనం తీసుకుని.. వచ్చిన ఫైళ్లను పరిశీలించి పై అధికారులకు ఫార్వర్డ్‌ చేయడం కూడా వారికి చేతకాదని అంటున్నారు. అయినా.. కమీషనలు మాత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనట. పనుల విషయంలో అంచనాలను తక్కువ ధరకు కోట్‌ చేసి పంపుతారని విమర్శలు వస్తున్నాయి. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పొసగదని, ఏ పని ...

 YCP People's Representative : చెరువును అమ్మేశాడు..!

YCP People's Representative : చెరువును అమ్మేశాడు..!

అధికారంలో ఉన్నాం కదా అని వైసీపీ వారు గడిచిన ఐదేళ్లు బరితెగించి వ్యవహారాలు నడిపారు. అక్రమ సంపాదన కోసం అడ్డమైన పనులన్నీ చేశారు. అనంతపురం రూరల్‌ మండలంలో ఓ ప్రజాప్రతినిధి అక్రమ లే అవుట్‌ వేయడంతోపాటు.. చెరువు స్థలాన్ని కబ్జా చేసి మరీ అమ్మేశాడు. జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని రాచానపల్లిలో ఈ వ్యవహారం నడుస్తోంది. సర్వే నంబరు 171లో రాచానపల్లి చెరువు ఉంది. ఆ చెరువకు ఆనుకుని వైసీపీ ప్రజాప్రతినిధి ఒకరు లే అవుట్‌ వేశారు. అదికూడా అనధికారిక లే అవుటే. ఇది ...

 JC Prabhakar Reddy  : నేను దొంగనని నిరూపించండి..!

JC Prabhakar Reddy : నేను దొంగనని నిరూపించండి..!

‘వైసీపీ ప్రభుత్వంలో మా కుటుంబాన్ని వేధించారు. దొంగ బస్సులు తెచ్చామని కేసులు పెట్టారు. అధికారులకు పది రోజులు గడువు ఇస్తున్నా. నేను దొంగనని నిరూపించాలి. లేదంటే ఎస్పీ ఆఫీస్‌ వద్ద నా కొడుకు, కోడలు.. డీటీసీ ఆఫీస్‌ వద్ద నేను, నా భార్య కూర్చుంటాం’ అని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరించారు. అనంతపురంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ....

Agriculture : సేద్యం.. యుద్ధం

Agriculture : సేద్యం.. యుద్ధం

ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నదాతలు సేద్యాన్ని వదలడం లేదు. ఎద్దులు దూరమైనా.. కన్న కొడుకుల భుజాలపై కాడెమాను మోపుతున్నారు. చదువుకుంటున్న పసివారు.. తండ్రికి తోడుగా పొలంలోకి దిగారు. ఇంటిల్లిపాదీ కష్టపడితేగాని అనంతలో వ్యవసాయం ముందుకు సాగదు. కంబదూరు మండలం నూతిమడుగు రైతు సర్దానప్పకు మూడు ఎకరాల పొలం ఉంది. ఇందులో టమోటా సాగు చేశాడు. కలుపు తీత పనులకు కూలీల ఖర్చులు భరించలేక.. తన ఇద్దరు ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి