Home » Devineni Umamaheswara Rao
ప్రజాస్వామ్యమన్నా, కోర్టులన్నా జగన్ రెడ్డికి లెక్క లేకుండా పోయిందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పోలీసు, న్యాయవ్యవస్థలు ఛాలెంజ్గా తీసుకొని జగన్ రెడ్డిపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించాలని దేవినేని ఉమ కోరారు.
జగన్ అబద్దపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. అరాచక ర్యాలీ, పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారని.. వారిని ఎందుకు జగన్ రెడ్డి పరామర్శించ లేదని దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు.
దేవినేని ఉమా కుమారుడు నిహార్ వివాహ వేడుక కంకిపాడులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
Devineni Son Wedding: మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లిలో సీఎం రేవంత్, మంత్రి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించేలా టీడీపీలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన విధానాన్నే సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. టీడీపీ ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ పెద్దల సభలో ప్రజా సమస్యలపై పోరాడాలని కోరారు.
మోపిదేవి వెంటకరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా.. ఛైర్మన్ ఆమోదం తెలిపారు. మూడు సీట్లలో ఒకటి జనసేనకు మరో రెండు టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటినుంచే రాజ్యసభ సీట్ల కోసం..
వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆరోపించారు. టికెట్లు అమ్మి రసీదులు ఇచ్చిన లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గొల్లపూడి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుడమేరు పాపం గత ప్రభుత్వానిదే అంటూ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘బుడమేరు గేట్లు ఎత్తేశారా..?’’ అని జగన్ అంటున్నారని... సీఎంగా.. ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసిన జగన్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) హామీ ఇచ్చారు.
Andhrapradesh: ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్ పేరుతో గత ప్రభుత్వ పెద్దలు చేసిన భూదందాలపై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భూబాగోతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... లక్షలాది ఎకరాల ప్రభుత్వ, దేవాదాయ, చుక్కల భూములు కొల్లగొట్టారని మండిపడ్డారు.