Home » Delhi liquor scam
దిల్లీ మద్యం కుంభకోణం ( Delhi Liquor Case ) కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ను వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ న్యాయవాది రూస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ చేసిన ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తోసిపుచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. 164 సెక్షన్ కింద ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ విచిత్ర ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ తన షుగర్ లెవెల్స్ను నిరంతరం పరీక్షించేందుకు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు అయ్యింది. ఈడీ కేసు బెయిల్ పిటిషన్పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన విచారణ వాయిదా పడింది.
మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసు బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ పాలసీ ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ కోరుతున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.
BRS MLC Kavitha: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో కవిత మాట్లాడంపై.. ఆమె తరపు న్యాయవాది మోహిత్రావును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ దాఖలు సమయంలో కవిత న్యాయవాది మోహిత్రావును న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన కవిత లాయర్.. మీడియా అడిగితే మాట్లాడారని న్యాయమూర్తికి వివరించారు..
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు(Kejriwal) సుప్రీంకోర్టులోనూ(Supreme Court) నిరాశే ఎదురైంది. కేజ్రీవాల్కు అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు. ఈడీ(ED) అరెస్ట్పై కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్ను ఏప్రిల్ 29న విచారిస్తానని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ..
దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఢిల్లీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతిస్తూ తీర్పునిచ్చింది.