• Home » Delhi Excise Policy

Delhi Excise Policy

Delhi liquor scam: దిల్లీ మద్యం కేసు.. పిటిషన్ విచారణ వాయిదా: సుప్రీంకోర్టు..

Delhi liquor scam: దిల్లీ మద్యం కేసు.. పిటిషన్ విచారణ వాయిదా: సుప్రీంకోర్టు..

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 28న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కాకుండా

Delhi Excise policy: సీఎంకు మనీలాండరింగ్ కేసులో ఆరోసారి ఈడీ సమన్లు

Delhi Excise policy: సీఎంకు మనీలాండరింగ్ కేసులో ఆరోసారి ఈడీ సమన్లు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు వ్యవహారం ముదురుతోంది. మనీలాండరింగ్ కేసు కింద విచారణకు హాజరుకావాల్సిందింగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు తాజాగా ఆరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19వ తేదీన తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది.

Excise policy scam: ఎంపీ సంజయ్ సింగ్‌కు దక్కని ఉపశమనం... బెయిలుకు హైకోర్టు 'నో'

Excise policy scam: ఎంపీ సంజయ్ సింగ్‌కు దక్కని ఉపశమనం... బెయిలుకు హైకోర్టు 'నో'

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు కింద అరెస్టయిన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Delhi excise case: మరో కీలక మలుపు.. సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

Delhi excise case: మరో కీలక మలుపు.. సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

ఎక్సైజ్ పాలసీ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదుసార్లు తమ సమన్లును బేఖాతారు చేశారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు బుధవారంనాడు ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి 17న హాజరుకావాలంటూ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.

Sanjay Singh: రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారానికి రెండోసారి కోర్టు అనుమతి

Sanjay Singh: రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారానికి రెండోసారి కోర్టు అనుమతి

ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ పార్లమెంటుకు వెళ్లి రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు రెండోసారి అనుమతించింది. ఫిబ్రవరి 8 లేదా 9వ తేదీల్లో ఆయన పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ మంగళవారంనాడు అనుమతించారు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి సంజయ్ సింగ్‌ను తగిన భద్రతతో ప్రమాణస్వీకారానికి తీసుకు వెళ్లాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.

Excise case: కేజ్రీవాల్ గైర్హాజరుపై కోర్టుకు ఈడీ ఫిర్యాదు

Excise case: కేజ్రీవాల్ గైర్హాజరుపై కోర్టుకు ఈడీ ఫిర్యాదు

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పదేపదే విచారణకు గైర్హాజర్ అవుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ పై రౌస్ అవెన్యూ కోర్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆశ్రయించింది. పీఎంఎల్-2002 సెక్షన్ 50 కింద సీఎంపై కోర్టులో ఫిర్యాదు చేసింది. తాము పంపిన సమన్లను ఖాతరు చేయడం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది.

ED: కేజ్రీవాల్ ఈడీ విచారణపై వీడని సస్పెన్స్

ED: కేజ్రీవాల్ ఈడీ విచారణపై వీడని సస్పెన్స్

లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. జనవరి 31వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

Delhi excise policy case: సీఎంకు తప్పని కష్టాలు... మళ్లీ ఈడీ సమన్లు

Delhi excise policy case: సీఎంకు తప్పని కష్టాలు... మళ్లీ ఈడీ సమన్లు

సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌‌కు కష్టాలు తప్పేలా లేవు. ఫిబ్రవరి 2న తమ విచారణ మందు హాజరు కావాల్సిందిగా కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు మరోమారు సమన్లు పంపింది.

Delhi Excise policy: ఆప్ నేత సంజయ్‌సింగ్‌కు ఊరట.. నామినేషన్‌ వేసేందుకు కోర్టు అనుమతి

Delhi Excise policy: ఆప్ నేత సంజయ్‌సింగ్‌కు ఊరట.. నామినేషన్‌ వేసేందుకు కోర్టు అనుమతి

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న 'ఆప్' నేత సంజయ్ సింగ్‌‌కు ఊరట లభించింది. ఢిల్లీ నుంచి రాజ్యసభకు జరుగనున్న ఎన్నికల్లో 'ఆప్' అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేసేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. ఆయనను రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తీసుకు వెళ్లాలని జైల్ సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.

Arvind Kejriwal: నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్?.. ఆప్ మంత్రులు ట్వీట్

Arvind Kejriwal: నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్?.. ఆప్ మంత్రులు ట్వీట్

అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. గురువారం ఉదయం అరవింద్ కేజ్రీవాల్‌ ఇంటిపై ఈడీ దాడులు చేస్తుందని, ఆ తర్వాత అరెస్ట్ అవకాశాలున్నాయని బుధవారం అర్ధరాత్రి చేసిన ట్వీట్‌లో వారు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి