Home » Danam Nagender
‘ఇయ్యాల అధికారిగా ఉంటావు. రేపు వెళ్తావు. మేము ఇక్కడే పుట్టి పెరిగినవాళ్లం. ఇక్కడే ఉంటాం. రిటైర్గానే మీ ఊరికి వెళ్తావు. వంద కేసులు పెట్టినా నేను భయపడను. ప్రజల దగ్గరకు పోతాను. అధికారులపై ప్రివిలేజ్ మోషన్ (హక్కుల ఉల్లంఘన) నోటీసు ఇస్తా. నా నియోజకవర్గంలోకి పోవద్దని చెప్పడానికి వారికేం అధికారమున్నది.
ఏటా గంగపుత్రులు నిర్వహించే గంగ తెప్పోత్సవం ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాథ్కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని దానం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని పేర్కొన్నారు.
చివరిరోజైన శుక్రవారం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. జాబ్ క్యాలెండర్పై ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రకటన అనంతరం.. జాబ్ క్యాలెండర్పై మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ సభాపతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కోరగా తిరస్కరించారు.
బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రె్సలోకి మారిన దానం నాగేందర్పై తక్షణమే అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దానం పార్టీ మారినట్లు బహిరంగ సాక్ష్యం ఉందని తెలిపారు.
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీజేపీకి చెందిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.
బీఆర్ఎస్ శాసనసభాపక్షం (బీఆర్ఎ్సఎల్పీ) త్వరలో కాంగ్రె్సలో విలీనం కావడం ఖాయమంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana: త్వరలో బీఆర్ఎస్ఎల్పీ.. కాంగ్రెస్లో విలీనం కాబోతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఆదర్శ్నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో హిమాయత్ నగర్ డివిజన్కు సంబంధించిన కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...
బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Dana Nagender) సూచించారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మార్పు, చేర్పులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేదెవరు..? ఉన్న మంత్రుల శాఖల మార్పు గురించి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక అప్ డేట్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. కొందరి మంత్రుల శాఖల మారుతాయని తేల్చి చెప్పారు. మంత్రివర్గంలోకి ముగ్గురి నుంచి నలుగురిని తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.