Home » Cyclone
తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాన్ తీరం దాటింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కృష్ణగిరి జిల్లాలో గత 14 గంటల్లో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదు అయింది.
ఫెంగల్ తుపాను ధాటికి అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఇప్పటివరకు 19 మంది మరణించారు. శనివారం మొదలైన ఈ తుపాను కారణంగా ఇప్పటివరకు ఏ ప్రాంతాల్లో ఎంత మంది మరణించారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఫెంగల్ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరంపైకి వచ్చినప్పటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు(సుమారు 12 గంటలపాటు) అక్కడే స్థిరంగా కొనసాగిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.
ఫెంగల్’ తుఫాను నగరాన్ని ముంచెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చెన్నై నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. శనివారం అంతా వర్షం కురుస్తూనే వుండడంతో వాణిజ్య కేంద్రాలుండే టి.నగర్, పురుషవాక్కం, ప్యారీస్(T. Nagar, Purushavakkam, Paris) వంటి ప్రాంతాలు సైతం నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుపాన్ తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాను తీరం దాటింది. దీని ప్రభావంతో ఆదివారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఫెంగల్ తుపాను ఈరోజు పుదుచ్చేరి తీరాన్ని తాకిన తర్వాత 7 రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది.
ఫంగల్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 240 కి.మీ., నాగపట్నానికి 330 కి.మీ., పుదుచ్చేరికి 390 కి.మీ., చెన్నైకి 430 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమైందని కూర్మనాథ్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దీంతో రైతులు తమ ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర కలత చెందుతుంది.అలాంటి వేళ.. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పామర్రు, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.