Home » CPI
హైడా పేరుతో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న తొందర పాటు చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా దేశ ప్రయోజనాలే మిన్నగా జీవితాంతం బతికిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Telangana: గ్రేటర్ హైదరాబాద్ లాంటి సిటీలో అనేకమంది పేదలు నివాసం ఉంటున్నారని తెలిపారు. మూడు భాగాలుగా పేద వారు, మధ్య తరగతి, సంపన్నులను గుర్తించి కూల్చివేతలు చేయాలన్నారు. మంచి కోసం మొదలు పెట్టిన పని రేపటి రోజున ఇతర అంశాలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఆటో, క్యాబ్ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
తెలంగాణకు స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందో నాయకులు తెలుసుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండమీద రాయుడు వెలసిన దేవరకొండకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని వైసీపీ, టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు యత్నిస్తు న్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నారా యణస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం సీపీఐ అధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
కమ్యూనిస్టు పార్టీ పేరు ఉచ్ఛరించడానికి, కమ్యూనిస్టు చరిత్రను చెప్పడానికి పాలక పార్టీలు భయపడతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు.
Andhrapradesh: విశాఖ స్టిల్ ప్లాంట్ కూడా ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోంది అని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టిల్కు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘‘మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ను ప్రైవేటుపరం కాకుండా చూడండి’’ అంటూ డిమాండ్ చేశారు.
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగ నమ్మినందుకు కుట్రలు పన్నుతున్నారని, ఇప్పటికే రెండు ప్లాంట్లను మూసివేసి మూడో ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారన్నారు.
పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్లు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు.