Home » CPI Narayana
దేశాన్ని మోదీ ప్రభుత్వం ( Modi Govt ) విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని సీపీఐ ( CPI ) జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) హెచ్చరించారు. మంగళవారం నాడు సీపీఐ కార్యాలయంలో సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు, నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ‘‘బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అయోధ్య రామమందిరానికి నాంది పలికిoది ఎల్కే అద్వానీ.. కానీ అదే ఆద్వానిని రామ మందిర ప్రారొంభోత్సవానికి రావొద్దని చెప్పారు’’ అని నారాయణ తెలిపారు.
పార్లమెంట్నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారని మోదీ ప్రభుత్వాన్ని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు ఢిల్లీలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన గతంలో ఎప్పుడూ లేదు. వారు చేసిన తప్పేంటి? పార్లమెంట్పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారని నారాయణ తెలిపారు.
ఏపీలో పార్టీలు అన్నీ కేంద్ర హోంమంత్రిని, బీజేపీని చూసి భయపడుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, జగన్ను ఎదుర్కోవాలంటే ఏపీలో అన్ని పార్టీలు కలవాలని ఆయన సూచించారు.
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐతో పొత్తు వలనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బతికుండగానే ఏపీ సీఎం జగన్ సమాధి కట్టుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) ఉమ్మడి ఖమ్మం /జిల్లాలో తమ పార్టీకి ఎలాంటి సహకారం అందించలేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖను రాశారు.
Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్పై సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఆహ్వానించే పరిస్థితి రానుందన్నారు. ప్రశ్నిస్తున్నాడని ఒక్కపుడు కేసీఆర్... రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించారని.. అదే రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి కేసీఆర్ రెడీగా ఉండాలన్నారు.
Telangana Politics: తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారిన వేళ సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలవాలని కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నం చేశారని.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు ఓటమి తెలిసే చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారని నారాయణ అన్నారు. కానీ కేసీఆర్ను కలవడానికి చంద్రబాబు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.
Assembly Elections : టీడీపీ అధినేత చంద్రబాబును కలవాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ యత్నిస్తున్నారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు ఒప్పు కోలేదని.. కేసీఅర్ ఓటమి తెలిసే చంద్రబాబుని కలిసే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ తీరు చూశామన్నారు. ఇప్పుడేమో బాబు మద్దతు కోసం చూస్తున్నానని సీపీఐ నారాయణ తెలిపారు.
Telangana Elections: ముఖ్యమంత్రి కేసీఆర్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ సన్ స్ట్రోక్ ఉంటే.. కేసీఆర్కు మాత్రం డాటర్ స్ట్రోక్ అంటూ కామెంట్స్ చేశారు. మంగళవారం రఘునాథపాలెం మండలం బాలపేటలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారాయణ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ ( Congress ) నేతలపై ఐటీ దాడుల వెనుక బీజేపీ ( BJP ) , బీఆర్ఎస్ ( BRS ) పార్టీ కుట్ర ఉందని సీపీఐ నేత నారాయణ ( Narayana ) వ్యాఖ్యానించారు.