• Home » CPI Narayana

CPI Narayana

LK Advani: జైల్లో ఉండాల్సిన అద్వాణీకి భారతరత్న ఇవ్వడం ఏంటి?

LK Advani: జైల్లో ఉండాల్సిన అద్వాణీకి భారతరత్న ఇవ్వడం ఏంటి?

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. జైల్లో ఉండాల్సిన ఆయనకు భారతరత్న ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరం కోసం 1990లో అద్వాణీ చేపట్టిన రథయాత్ర దేశంలో మతకల్లోహాలు సృష్టించిందని విమర్శించారు.

AP NEWS: రేపో మాపో ఆ సీఎం అరెస్టు అవ్వడం ఖాయం.. సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

AP NEWS: రేపో మాపో ఆ సీఎం అరెస్టు అవ్వడం ఖాయం.. సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

సీఎం జగన్(CM JAGAN) మీద 12కేసులు ఉన్నా.. యథేచ్చగా బయట తిరుగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) అన్నారు. దేశంలోనే 420ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జవాబుదారీ పార్లమెంట్‌ను పక్కన పెట్టి.. మోదీ ఇజమని చెబుతున్నారని మండిపడ్డారు.

  CPI Narayana: కేటీఆర్ తానే ముఖ్యమంత్రిని అనుకుంటున్నారు..!! సీపీఐ నారాయణ సెటైర్లు

CPI Narayana: కేటీఆర్ తానే ముఖ్యమంత్రిని అనుకుంటున్నారు..!! సీపీఐ నారాయణ సెటైర్లు

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీపీఐ అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారు. ఆయన మాట తీరు అలా ఉందని సీపీఐ నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తోందని, రేవంత్ రెడ్డి సీఎం పదవీ చేపట్టారని కేటీఆర్‌కు గుర్తుచేశారు.

CPI Narayana: అయోధ్య రామాలయం ఎన్నికల స్టంట్.. ‘ఇండియా’ని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు

CPI Narayana: అయోధ్య రామాలయం ఎన్నికల స్టంట్.. ‘ఇండియా’ని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కక్కిన కూడును తినేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆశపడ్డాడని మండిపడ్డ ఆయన.. ‘ఇండియా’ కూటమిని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

CPI Narayana.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు: నారాయణ

CPI Narayana.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు: నారాయణ

న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని, రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక మతాన్ని పెంపొందించారని, కాబినెట్‌లో కూడా మతాన్ని రాజకీయం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

Narayana: ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి పట్టినగతే జగన్‌కూ పడుతుంది

Narayana: ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి పట్టినగతే జగన్‌కూ పడుతుంది

Andhrapradesh: అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సీపీఐ నేత నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి పట్టినగతే జగన్‌కు పడుతుందని హెచ్చరించారు.

CPI Narayana: పేదల జోలికొస్తే తాట తీస్తాం.. ‘దానం’ అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి..

CPI Narayana: పేదల జోలికొస్తే తాట తీస్తాం.. ‘దానం’ అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి..

బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో పేదల ఇళ్లు అన్యాయంగా కూల్చి కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ(CPI National Secretary Dr. K. Narayana) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Narayana: కేసీఆర్‌ను జగన్ కలవడంపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు

Narayana: కేసీఆర్‌ను జగన్ కలవడంపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు

Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ కలవడంపై సీపీఐ నేత నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఓట్ల‌ కోసమే మాజీ సీఎం కేసీఆర్‌ను జగన్ కలిశారని విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్లో కుంపటి వ్యాఖ్యలు చేసి.. జగన్ తన ఓటమిని ఒప్పుకున్నారన్నారు. తన‌ ఇంట్లో తానే జగన్ గొడవ సృష్టించుకుని ఇతరులను నిందిస్తున్నారన్నారు.

CPI  Narayana: దేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోం

CPI Narayana: దేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోం

దేశాన్ని మోదీ ప్రభుత్వం ( Modi Govt ) విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని సీపీఐ ( CPI ) జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) హెచ్చరించారు. మంగళవారం నాడు సీపీఐ కార్యాలయంలో సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు, నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ‘‘బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అయోధ్య రామమందిరానికి నాంది పలికిoది ఎల్కే అద్వానీ.. కానీ అదే ఆద్వానిని రామ మందిర ప్రారొంభోత్సవానికి రావొద్దని చెప్పారు’’ అని నారాయణ తెలిపారు.

Narayana : ఎన్నికల జిమ్మిక్‌లో భాగంగానే పార్లమెంట్‌పై దాడి

Narayana : ఎన్నికల జిమ్మిక్‌లో భాగంగానే పార్లమెంట్‌పై దాడి

పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారని మోదీ ప్రభుత్వాన్ని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు ఢిల్లీలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన గతంలో ఎప్పుడూ లేదు. వారు చేసిన తప్పేంటి? పార్లమెంట్‌పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారని నారాయణ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి