Home » Covid-19
కొవిడ్ పై రాష్ట్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం అన్నారు. తాజాగా వ్యాపిస్తున్న కొవిడ్ ప్రాణాంతకమైనది కాదని మంత్రి అన్నారు.
COVID Case: అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. ఓ మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది.
దేశంలో గడచిన 24 గంటల్లో 864 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 4,302కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొవిడ్ యాక్టివ్ కేసుల్లో ముందున్న కేరళలో తాజాగా 43 కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,373కు చేరింది. పశ్చిమబెంగాల్లో కొత్తగా 60 కేసులు నమోదై 432కు చేరుకున్నాయి. ఢిల్లీలో కొత్తగా 64 కేసులు నమోదై 457కు చేరింది.
కొవిడ్పై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాపించకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ముందు జాగ్రత్తతోనే కోవిడ్ను ఎదుర్కోగలమని ఆయన అన్నారు.
COVID-19: తెలుగు రాష్ట్రాలలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో మరో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కోవిడ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. అలాగే తెలంగాణలోని వరంగల్ ఎంజీఎం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక సీఎస్ ఎంటీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రోజుకు వెయ్యి మందికి పరీక్షలు జరగాలని, అవసరమైన కిట్లు మరియు పీపీఈ కిట్ల సరఫరా గురించి సూచించారు.
గుంటూరు నగరంలో రెండు కొత్త COVID-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితులను ఆస్పత్రిలో చేర్చుకొని వైద్య చికిత్స అందిస్తున్నారు, అలాగే ప్రత్యేక ఓపీ మరియు ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు.
భారతదేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 3,395 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి గత వారం కంటే 1200 శాతం పెరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
మంత్రిత్వ శాఖ అధికార గణాంకాల ప్రకారం, కేరళలో 1,147 కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ఇంతవరకూ 148 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 148, పశ్చిమబెంగాల్లో 116 కేసులు నమోదయ్యాయి.