Home » Court
2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యువతి సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు ఆమె లేఖలో పేర్కొంది.
మంత్రి కొండా సురేఖకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో బిగ్ షాక్ తగిలింది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కేటీఆర్పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకువచ్చారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని ఆరోపించారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా పడింది.
పోలీస్ స్టేషన్లో సీనియర్ అధికారి కార్యాలయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూ కోసం గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ స్టూడియోగా వాడుకోవడంపై పంజాబ్ హరియాణా హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాలపై తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సినీనటుడు అల్లు అర్జున్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన రూ.100 కోట్ల సివిల్ పరువు నష్టం దావా కేసుకు సంబంధించి మంత్రి కొండా సురేఖపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
పట్టణంలోని బాలుర బీసీ హాస్టల్ను సీనియర్ సివిల్ న్యాయాధికారి ఇందిరా ప్రియదర్శిని గురువారం తనిఖీ చేశారు.