Home » Congress 6 Gurantees
రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో ఈరోజు(మంగళవారం) వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డికు (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఈరోజు( మంగళవారం) బహిరంగ లేఖ రాశారు. నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని చెప్పారు.
రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు.
రైతు రుణమాఫీ (Rythu Runa Mafi) అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. తెలంగాణ ఇస్తానన్న హామీని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ నిలబెట్టుకున్నారని తెలిపారు.
అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని దుద్దిళ్ల మంత్రి శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) తెలిపారు.ధర్నా చౌక్లో విద్యార్థుల ధర్నాపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మొదటి సంతకంతోనే పింఛను మొత్తాన్ని రూ.4వేలకు పెంచారని.. తెలంగాణలో ఆరు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు (Harish Rao) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ (Dasoj Shravan) బహిరంగ లేఖ రాశారు. పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా మీ పరిపాలన చాల అధ్వాన్నంగా మారిందని అన్నారు.