Home » Congress 6 Gurantees
Minister Thummala Nageshwar Rao: ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు సాయం అందజేస్తామని తెలిపారు.
Rythu Bharosa scheme: కాంగ్రెస్ హామీల్లో భాగంగా సీఎం రేవంత్రెడ్డి ఆదివారం నాడు నారాయణపేట జిల్లాలో నాలుగు పథకాలను ప్రారంభించారు. అయితే రైతుభరోసా సాయం ఎప్పుడు అందుతుందోనని రైతులు ఆందోళన చెంతున్నారు. ఈ డబ్బులు త్వరగా పడితే బాగుంటుందని అన్నదాతలు అనుకుంటున్నారు.
CM Revanth Reddy: కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి.. పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
KTR:రేవంత్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వన్ విలేజ్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్య పెడతోందని కేటీఆర్ ఆరోపించారు.
KTR: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఇచ్చి పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.
Minister Ponnam Prabhakar: మెప్మా ద్వారా మహిళలకు సాయమందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గౌరవెల్లి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్కు సంబంధించిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరుతానని చెప్పారు. తన మీద కేసులు ఉన్నాయి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పూణే కోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. పరువు నష్టం కేసులో పూణే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీపై ఈ పరువు నష్టం కేసును విడి సావర్కర్ మనవడు దాఖలు చేశారు.
KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీల పేరిట ప్రజలను తప్పు దోవ పట్టించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
BANDI SANJAY: విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రేవంత్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చే వరకు ఆందోళన చేస్తామని బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.
Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకంగా ఉండేందుకు విజిలెన్స్ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏమైనా అనుమానాలు ఉంటే వెబ్ సైట్లో నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్, ఇసుకపై కేబినెట్లో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.