Home » Congress 6 Gurantees
దేవుడు అయిన రాముడినీ సైతం బ్యాలెట్ బాక్స్లోకి తీసుకురావడం చాలా సిగ్గుచేటని.. ఆ దౌర్భాగ్య స్థితికి బీజేపీ (BJP) తెరలేపిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆరోపించారు. ప్రధానమంత్రి స్థానంలో ఉండి నరేంద్రమోదీ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ (Congress) బ్రిటిష్ వారసత్వాన్ని ఇంకా కొనసాగిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందిన సోనియాగాంధీని దేశంపై రుద్దే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు. ఆమె ప్రధాని కాకుండా బీజేపీ అడ్డుకుందని గుర్తుచేశారు.
లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తి వేస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. నెహ్రు, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోదీ తీసివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలుస్తామని మోదీ అంటున్నారని గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు.
అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. మంగళవారం నాడు పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.
లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
కాంగ్రెస్ (Congress) అంటేనే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు కొండాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం అయ్యారు.
తమ ప్రభుత్వం ఉండదంటావా లాగులో తొండలు వేసి నల్గొండ బిడ్డలతో కొట్టిపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు భువనగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అబద్ధాలు ఆడడంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు (Harishrao) ఆరోపించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అభివర్ణించారు. ఆదివారం నాడు గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీ చరిత్ర.. ఆయన రాజకీయం మీద బీజేపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పెండింగులో ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇంటి బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasa Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్, కోటగిరి, రుద్రూరు మండల కేంద్రాల్లో జరిగిన కార్నర్ మీటింగ్లలో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్తో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.