• Home » Collages

Collages

Hyderabad: 3 వైద్య కాలేజీలకు రూ. 204 కోట్లు..

Hyderabad: 3 వైద్య కాలేజీలకు రూ. 204 కోట్లు..

జూనియర్‌ డాక్టర్ల డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు పాత మెడికల్‌ కాలేజీలకు రూ.204 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు.

Hyderabad: కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఎంసీ తనిఖీలు ..

Hyderabad: కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఎంసీ తనిఖీలు ..

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 8 వైద్య కళాశాలను జాతీయ వైద్య కమిషన్‌ బృందాలు తనిఖీ చేశాయి. రాష్ట్రానికి సోమవారం ఉదయం 8 బృందాలు రాగా... ఒక్కో బృందంలో నలుగురు సభ్యులు ఉన్నారు.

Hyderabad: ఉసురు తీసిన హాస్టల్‌ భయం..

Hyderabad: ఉసురు తీసిన హాస్టల్‌ భయం..

ఇంటికి, అమ్మానాన్నకు దూరంగా హాస్టల్‌లో ఉంటూ చదువుకోవడం ఆ బాలుడికి చాలా భయంకరంగా అనిపించింది. తన కష్టాన్ని అమ్మకు చెబితే.. కొడుకు భవిష్యత్తు కోసం ఆ తల్లి నచ్చజెప్పింది. కానీ, హాస్టల్‌లో ఉండే దైర్యం చేయలేకపోయిన ఆ బాలుడు అక్కడి నుంచి పారిపోయేందుకు సాహసించి ప్రాణాలు కోల్పోయాడు.

JNTU: పార్ట్‌టైమ్‌ బీటెక్‌కు జేఎన్‌టీయూ పచ్చజెండా..

JNTU: పార్ట్‌టైమ్‌ బీటెక్‌కు జేఎన్‌టీయూ పచ్చజెండా..

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం పార్ట్‌టైమ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌ల నిర్వహణకు జేఎన్‌టీయూ పచ్చజెండా ఊపింది. పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్‌ తమ ఉద్యోగాలు చేస్తూనే బీటెక్‌ కోర్సులను అభ్యసించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మార్గం సుగమం చేసింది.

Hyderabad: వైద్య విద్యపై నేరుగా పర్యవేక్షణ..

Hyderabad: వైద్య విద్యపై నేరుగా పర్యవేక్షణ..

నాణ్యమైన వైద్య విద్యను అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ప్రైవేటు కాలేజీలపై హెల్త్‌ యూనివర్సిటీ పర్యవేక్షణ ఉండగా.. ఇక నుంచి సర్కారే పర్యవేక్షించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

AP NEWS: శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం

AP NEWS: శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం

ఏలూరు జిల్లా కామవరపుకోటలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో (Sri Venkateswara Junior College) అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. గత 40 సంవత్సరాలుగా ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కాలేజ్ నడుస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కాలేజీని పట్టించుకోక పోవడంతో విద్యార్థులు తగ్గిపోయారు.

Hyderabad: నీట్‌లో ఉత్తరాది ఆధిక్యం..

Hyderabad: నీట్‌లో ఉత్తరాది ఆధిక్యం..

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న అర్హత పరీక్ష నీట్‌ రాస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటికేడాదీ పెరుగుతోంది. గడిచిన ఏడేళ్లలో ఆ సంఖ్య రెట్టింపు అయింది. 2018లో దేశవ్యాప్తంగా 13.26 లక్షల మంది నీట్‌ పరీక్ష రాయడానికి నమోదుచేసుకోగా.. 2024 నాటికి ఆ సంఖ్య 24.06 లక్షలకు చేరుకుంది.

Inter Colleges: లెక్చరర్లు లేని ఇంటర్‌ విద్య

Inter Colleges: లెక్చరర్లు లేని ఇంటర్‌ విద్య

ఇంటర్మీడియెట్‌పై ఇంటర్‌ విద్యామండలి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. శనివారం నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభమవుతున్నా ఇప్పటి వరకు కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్లను రెన్యువల్‌ చేయలేదు.

COLLECTOR : రేపటి నుంచి అడ్వాన్సడ్‌ సప్లీ పరీక్షలు

COLLECTOR : రేపటి నుంచి అడ్వాన్సడ్‌ సప్లీ పరీక్షలు

ఇంటర్‌ అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలలో శుక్రవారం నుంచి జూన ఒకటో తేదీవరకూ పరీక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో బుధవారం వివిధ శాఖల అదికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 ...

Hyderabad: ఎంబీబీఎస్‌పై అస్పష్టత

Hyderabad: ఎంబీబీఎస్‌పై అస్పష్టత

: రాష్ట్రంలో వైద్య విద్య అడ్మిషన్ల విషయంలో స్థానికత, ఈడబ్ల్యూఎస్‌ కోటాపై సర్కారు నుంచి స్పష్టత కరువైంది. వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. దేశవ్యాప్తంగా నీట్‌ ఫలితాలు జూన్‌ 14న రానున్నాయి. తర్వాత వారం, పది రోజుల్లోనే హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. అంటే.. సరిగ్గా నెల రోజుల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి