Home » CM Stalin
కన్నీరు వద్దు తంబీ.. మన వైద్యఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం నీకు తగిన వైద్యం అందేలా ఏర్పాటు చేస్తారు.. అంటూ ఓ దివ్యాంగ విద్యార్ధికి భరోసా ఇచ్చారు. ఓ ప్రమాదంలో చేతిని కోల్పోయి అతని దీనస్థితిపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీనిపై సీఎం స్టాలిన్ స్పందించి భరోసా కల్పించారు.
మా ఓటమి కోసం ప్రతిపక్ష పార్టీలు తపిస్తున్నాయని, కానీ... వారు అనుకున్నట్లు అలాంటిదేమీ జరగబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. వారు ఎన్ని ప్రయోగాలు చేసినా.. ప్రజలు తమవైపే ఉన్నారన్నారు. అంతేగాక.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు.
పింక్ ఆటోలను పురుషులు నడిపితే స్వాధీనం చేసుకుంటామని జిల్లా కలెక్టర్ రష్మి సిద్దార్ధ్ హెచ్చరించారు. చెన్నైలో మహిళలు, పిల్లల భద్రత దృష్టిలో పెట్టుకుని జీపీఎస్, క్యూ ఆర్ కోడ్ తదితర వసతులతో కూడిన ‘పింక్’ ఆటోలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు అంటూ పేర్కొన్నారు. 2026లో జరిగే ఎన్నికల్లో ఒకే వెర్షన్ మాత్రమేనని, అది రాష్ట్రంలో అన్నాడీఎంకే వెర్షన్ మాత్రమేనని ఈపీఎస్ తెలిపారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్రంలో మత ఉగ్రవాదాన్ని సహించబోమని కూడా పేర్కొన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడారు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాని, గవర్నర్ కార్యాలయమైన రాజ్భవన్ల మధ్య మళ్ళీ అగాదం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వానికా కొరకురాని కొయ్యగా మారిన గవర్నర్ ఆర్ ఎన్ రవి.. తాజాగా విడుదల చేసిన ప్రకటన పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. ఆ ప్రకటన సారాంశాన్ని ఓసారి పరిశీలిస్తే...
నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘నీట్’పై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
సినీనటుడు, ‘మక్కల్ నీదిమయ్యం’ అధినేత కమల్హాసన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కమల్ మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్కు వ్యతిరేకంగా జరిపిన న్యాయపోరాటంలో ముఖ్యమంత్రి స్టాలిన్ గెలిచిన ఆనందోత్సాహంలో తాను కూడా పాలుపంచుకున్నానన్నారు.
చెన్న మహానగరంలో కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అంటూ పిలుపునిచ్చి సోషలిస్టు భావాలను వ్యాపింపజేసిన ప్రముఖ సోషలిస్టు విప్లవకారుడు, సామాజిక వేత్త కార్ల్మార్క్స్ను భావితరాలు గుర్తుంచుకోవాలని సీఎం అన్నారు.
గత ఎన్నికల సమయంలో మేం ఇచ్చిన మాట ప్రకారం కావేరి-వైగై-గుండారు నదుల అనుసంధానం చేసి తీరుతామని మంత్రి దురైమురుగన్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. నదుల అనుసంధానం విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమాలు అవసరం లేదన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి పేర్కొన్నారు.