Home » CM Stalin
సినీ, రాజకీయ రంగాల్లో చక్రం తిప్పిన ఎంజీఆర్లా ఎదిగి, వచ్చే ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పగటికలలు కంటున్నాడని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీమంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar) విమర్శించారు,
ప్రతిభాషకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం విద్యార్థుల భవిష్యత్తుకు మంచిదని, అదే సమయంలో ప్రతిభాషను విద్యార్థులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించడం వారికి భారం అవుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు.
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే 200కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రముఖ హాస్య నటుడు వడివేలు(Actor Vadivelu) జోస్యం చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) రోజులో కేవలం కొన్ని గంటలు మాత్రమే నిద్రిస్తూ, మిగిలిన సమయంలో ప్రజాసేవకు అంకితమవుతున్నారన్నారు.
రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాటం సాగించాల్సిన సమయం ఆసన్నమైందని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు.
తమిళనాడులో 39 పార్లమెంటరీ నియోజకవర్గాలుండగా, నియోజకవర్గాల పునర్విభన పేరుతో సీట్లు తగ్గడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) మార్చి 1న 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో వారం రోజులకు ముందే డీఎంకే శ్రేణులు ఆయన జన్మదిన వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు.
భారతదేశంపై, భారత రాజ్యాంగంపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు నమ్మకంలేదని, ఆయనకు అహంకారం ఎక్కువని గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) చేసిన ఆరోపణలపై సీనియర్ మంత్రి దురైమురుగన్(Senior Minister Duraimurugan), ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మండిపడ్డారు.
ద్రావిడ తరహా డీఎంకే పాలనలో మహిళా సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల వల్ల లబ్ధిపొందుతున్న మహిళలంతా తనను ‘నాన్నా..! నాన్నా’ అని పిలుస్తుండటం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ఆ పిలుపొక్కటే సుపరిపాలనకు నిదర్శనమని సీఎం స్టాలిన్ అన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin), అందరికి మూడు నెలల ‘రీచార్జ్’ చేస్తున్నారంటూ సామాజిక మాద్యమాల్లో వస్తున్న మెసేజ్లు నమ్మరాదని సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber Crime Police) హెచ్చరిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆదేశాల మేరకు రాష్ట్ర ఆలయాల తరపున అయ్యప్ప భక్తులకు బిస్కెట్ ప్యాకెట్ల(Biscuit packets)ను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం రెండో దశగా మరో 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్ల లోడు వాహనానికి దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్ బాబు(Minister PK Shekhar Babu) జెండా ఊపి ప్రారంభించారు.