Home » CM Siddaramaiah
కర్ణాటక గవర్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంపై విచారణకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. ఐదుగురిని కేబినెట్ నుంచి తొలగించి ఆరుగురి ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో కర్ణాటక(Karnataka)కు దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల అవి మరింత బలపడుతున్నాయి. కొన్నేళ్లుగా జలవనరులకు సంబంధించి ఒకటి రెండు సభలు మినహా మిగిలిన విభాగాలపై చర్చలు జరిగిన దాఖలాలు లేవు.
ముడా ఇంటి స్థలాల అక్రమాలలో ముఖ్యమంత్రి(Chief Minister) కుటుంబానికి భాగస్వామ్యం ఉందని నిరసిస్తూ బీజేపీ(BJP) చేపట్టిన చలో మైసూరు పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న తరుణంలో మరో యాత్ర చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అనంతరం మరో పాదయాత్ర చేయాలని బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు.
‘నోటీసులకు భయపడను.. తప్పు చేసి ఉంటే కదా వెనుకాడాల్సింది..? వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా)లో తన భార్యకు ఇంటి స్థలాలు కేటాయించడంలో అవినీతి జరగలేదని అయినా బీజేపీ, జేడీఎస్ సభ్యులు తనకు చెడ్డపేరు తీసుకురావాలనే కుట్ర పన్నారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(CM Siddaramaiah) మండిపడ్డారు. తాను రెండోసారి సీఎం కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు విస్తరిస్తున్న బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP))ను పాలనా సౌలభ్యాల కోసం విభజించాలనే ప్రక్రియకు తుదిరూపు దిద్దారు. గతంలో 3 లేదా 5 భాగాలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఏకంగా మూడు విడతల పాలనా వ్యవస్థ, గరిష్టంగా 10 పాలికెలను అనుసంధానం చేసుకుని గ్రేటర్ బెంగళూరు పాలనా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రైవేటు రంగాల్లో స్థానికులు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో.. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘బిల్లు’పై తీవ్ర దుమారం నెలకొన్న సంగతి తెలిసిందే.
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన అవినీతిలో సీఎం సిద్దరామయ్య కుటుంబ భాగస్వామ్యం, వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ గ్రాంట్లు బినామీ ఖాతాలకు ....
వర్షాభావ పరిస్థితులకు తోడు జలాశయాల్లో నీటి మట్టం అడుగంటుతుండటంతో కావేరీ జలాల్ని(Cauvery Water) తమిళనాడుకి విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడటానికి ఆయన ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.