Home » CM Siddaramaiah
ఆగస్ట్ 29వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని ట్రయిల్ కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తవర్చంద్ గెహ్లాత్ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలను నిలిపివేయాలంటూ సీఎం సిద్దరామయ్య సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
మైసూరు అర్బన్ డెవలప్మెమంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో తనను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ తావర్చంద్ గెహ్లాత్ ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలని సీఎం సిద్దరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సింగిల్ జడ్జి జస్టిస్ హేమంత్ చందనగౌండర్ ధర్మాసనం ఈ రోజు విచారించనుంది.
దేశంలో బీజేపీ తనకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) అన్నారు. తన మాట వినని రాష్ట్రాల సీఎంలను ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు.
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార(ముడా) కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ అంశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు (ప్రాసిక్యూషన్) గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ శనివారం అనుమతులు ఇచ్చారు.
మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు.
కర్ణాటక గవర్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంపై విచారణకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. ఐదుగురిని కేబినెట్ నుంచి తొలగించి ఆరుగురి ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో కర్ణాటక(Karnataka)కు దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల అవి మరింత బలపడుతున్నాయి. కొన్నేళ్లుగా జలవనరులకు సంబంధించి ఒకటి రెండు సభలు మినహా మిగిలిన విభాగాలపై చర్చలు జరిగిన దాఖలాలు లేవు.
ముడా ఇంటి స్థలాల అక్రమాలలో ముఖ్యమంత్రి(Chief Minister) కుటుంబానికి భాగస్వామ్యం ఉందని నిరసిస్తూ బీజేపీ(BJP) చేపట్టిన చలో మైసూరు పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న తరుణంలో మరో యాత్ర చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అనంతరం మరో పాదయాత్ర చేయాలని బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు.
‘నోటీసులకు భయపడను.. తప్పు చేసి ఉంటే కదా వెనుకాడాల్సింది..? వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.