Home » CM Revanth Convoy
రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరు (ఎల్లుండి)లోగా రైతులకు రూ.1.50 లక్షల రుణాలను మాఫీ చేసి, తమ నిబద్ధతను చాటుకుంటామని తెలిపారు.
Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబరులో జరగనున్నాయా!? ఇందుకు నవంబరులో నోటిఫికేషన్ విడుదల కానుందా!? ఈ ప్రశ్నలన్నిటికీ ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు.
చదువు కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా గిరిజన ఆడబిడ్డకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఐఐటీలో చేరేందుకు ఆ విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసింది.
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్ నేవీ రాడార్ (వేరి లో ఫ్రీక్వెన్సీ-వీఎల్ఎఫ్) ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టనున్నారు.
తెలంగాణ భవన్ను ఢిల్లీలోనే ఒక ఐకానిక్ టవర్గా నిర్మించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తాను మంత్రి పదవిని చేపట్టిన మూడో రోజే తెలంగాణ భవన్ నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన బీఆర్ఎ్సకు.. శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్సరెడ్డి.. సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రె స్లో చేరారు.
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రె్సకు అంచనాల కంటే తక్కువ సీట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏఐసీసీ నియమించింది. పార్టీ జాతీయ నాయకులు పీజే కురియన్, రఖిబుల్ హుసేన్, పర్గత్సింగ్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.
రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో కలెక్టర్ల బదిలీలను చేపట్టింది. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పని చేస్తున్న 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి ఈ నియామకాలు చేపట్టింది.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇకపై ల్యాండ్ క్రూయిజర్ కార్లలో ప్రయాణించనున్నారు. పూర్తిస్థాయి బుల్లెట్ ప్రూఫ్తోపాటు శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ల్యాండ్ క్రూయిజర్లను మంత్రులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తన కాన్వాయ్ కోసం రూ.66 కోట్లతో 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లను కొనుగోలు చేశారు.
సచివాలయంలో వాస్తు మార్పులు జరగబోతున్నాయా.? ముఖ్యమంత్రి సచివాలయంలోకి వచ్చి, వెళ్లే ద్వారాలు కూడా మారబోతున్నాయా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి తాజా పరిణామాలు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారాన్ని మూసి వేయడం, అవి తెరుచుకోకుండా ఉండేందుకు మూడు స్టెప్పుల మేర ఇనుప తీగలతో లాక్ చేయడం వంటివి ఈ అభిప్రాయాలకు బలాన్నిస్తున్నాయి.