Home » CM Ramesh
కడప జిల్లా: అనకాపల్లి ఎంపీగా ఎన్నికై కడపకు రావడం చాలా ఆనందంగా ఉందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శుక్రవారం కడపకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ నుంచి వచ్చి అనకాపల్లిలో ఎలా రాజకీయాలు చేస్తారని వైసీపీ నేతలు ప్రశించారని అన్నారు. అయితే..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమి కార్యకర్తలు ఐకమత్యంతో తమను గెలిపించినందుకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(MP C.M.Ramesh) కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తీర్చిదిద్దారని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మోడీ హయాంలో ఎయిర్పోర్టులు, జాతీయ రహదారులు అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
ఏయూలో చాలా అక్రమాలు, అన్యాయాలు జరిగాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) తెలిపారు. ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన వదిలేది లేదని, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ఐదేళ్లుగా ఈ అసెంబ్లీ వైపే రాలేదని.. ఇప్పుడు అతి పెద్ద విజయంతో వచ్చామని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో ఎంపీ సీఎం రమేష్ మీడియాతో చిట్చాట్ చేశారు. గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి(Undavalli) నివాసానికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఇవాళ(గురువారం) ఉదయం నుంచీ పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు.
సీపీ నుంచి వచ్చే వారిని తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి డంపింగ్ యార్డ్ కాదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని నష్టపరిచి దాకోవడానికి, దాచుకోవడానికి వచ్చేవారిని కూటమిలో చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
రామోజీరావు మరణం మీడియా రంగానికే తీరని లోటు అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీడియా, సినీ, టీవీ రంగాల్లో దిగ్గజంగా వెలిగిన రామోజీరావు మరణం బాధాకరమన్నారు. వ్యాపారాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని విజయపథంలో నడిపించిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఒక భారతీయ వ్యాపారవేత్తగా, ఈనాడు గ్రూపు సంస్థల అధినేతగా ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించుకున్న మహా మేధావి అని సీఎం రమేష్ కొనియాడారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మే 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అధికాక నిన్న మెజార్టీ సర్వేలు ఎక్సిట్ పోల్స్లో కూడా ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టనుందని తెలిపాయి.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు తనకే అంటున్నాడని.. అటు ఒకటో నెంబర్ గాని ఇటు ఐదో నెంబర్ గాని కచ్చితంగా లెగిసిపోతాయని ఎద్దేవా చేశారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్పోల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ మూడు లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు.