Home » CM Jagan
వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి తాను కారణం కాదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. వారిలో 22మంది ఇప్పటికీ ఉన్నారని... తనవల్లే పార్టీ మారినట్లు వారితో చెప్పించాలని ఆయన సవాల్ విసిరారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు తనకే అంటున్నాడని.. అటు ఒకటో నెంబర్ గాని ఇటు ఐదో నెంబర్ గాని కచ్చితంగా లెగిసిపోతాయని ఎద్దేవా చేశారు.
ఏపీని సీఎం జగన్ రెడ్డి అప్పుల ఊబిలో నెట్టాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండీ రాకేష్ (Dundee Rakesh) ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ నేతలు గుండెలు గుభేల్ అని కొట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.
బ్లూ మీడియాలో వార్తలు చూస్తుంటే పూర్తిగా దిగజారిపోయారనిపిస్తుందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు (Ashok Babu) ఆరోపించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. సీఎం కుటుంబం రాష్ట్రానికి చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ , మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ స్వాగతం పలికారు.
జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఘోర పరాజయం తప్పదని తెలుసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సచివాలయం నుంచి కీలకమైన ఫైల్స్, ఈ ఫైల్స్ ను మాయం చేసే పనిలో ఉన్నాడని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న సీఎస్ పట్ల కేంద్ర ఎన్నికల కమిషన్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు
కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగడంతో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి భయం పట్టుకుంది. ఎక్కడ ఓడిపోతాననే భయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సంప్రదింపులు జరిపారు. జగన్ ఇలాకా పులివెందులలో అసెంబ్లీకి టీడీపీకి వేస్తాం అని, పార్లమెంట్ స్థానానికి తనకు ఓటు వేయాలని అవినాశ్ రెడ్డి సమాచారం పంపించారని తెలిసింది.
జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి శుక్రవారం పదవీ విరమణ చేశారు. 2006 బ్యాచ్కు చెందిన ఆయన.. రాష్ట్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.
సాధారణంగా పరిశ్రమల స్థాపన కోసమో, ఇతర అవసరాల కోసమో ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరిస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్త విషయం ఏంటంటే.. ఓ ప్రైవేటు వ్యక్తి గ్రామాలకు గ్రామాలనే తన వశం చేసుకుంటున్నాడు.
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అనుకున్నది సాధించారు. యూనిఫాంలో రిటైరవ్వాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరింది. హైకోర్టు చెప్పిందనో, ఉన్నతాధికారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందనో తెలియదు గానీ.. ఆయన పదవీవిరమణ చేయాల్సిన శుక్రవారం నాడే జగన్ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది.