Home » CM Jagan
తంబళ్లపల్లెలో పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువగా ఉందని, ఓవరాక్షన్ తగ్గించుకోకుంటే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఐ కూటమి అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. అంగళ్లులో కిరణ్ కుమార్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ (CM Jagan) నీ టైమ్ అయిపోయిందని.. ఈనెల 13న రెండు సింహాలు( చంద్రబాబు, పవన్ కళ్యాణ్) మధ్య నలిగిపోవడం ఖాయమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. సింహాం సింగిల్గా వస్తుందని జగన్ మాటిమాటికీ అంటున్నారని.. కానీ ఆ రెండు సింహాల మధ్య నలిగి పోతాడని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
సీఎం జగన్ (CM Jagan) పులిలా గర్జించాడని.. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారని.. కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద చివరికి పిల్లిలా మారారని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల (YS Sharmila) సెటైర్లు గుప్పించారు. పదేళ్లలో పది పరిశ్రమలైనా ఏపీకి వచ్చాయా? అని ప్రశ్నించారు. ఏపీకి పదేళ్ల కిందట ప్రత్యేక హోదా రావాలని.. కానీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్, బెంగుళూరులో ఉన్న ప్యాలెస్, మాల్ను ఎన్నికల అఫిడవిట్లో సీఎం జగన్ రెడ్డి ( CM Jagan) ఎందుకు చూపించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...స్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి లక్షలాది కోట్లా ఆస్తులా.. ? అవి ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) మండిపడ్డారు. ఏపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందని అన్నారు. ఏపీ ప్రగతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీవీ నరసింహరావుకి సైతం భారతరత్న ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు.
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్లు కొందరైతే.. విశ్వసించని వారు మరికొందరు.. అయితే ఎన్నికల వేళ మాత్రం రాజకీయ నాయకులు ఎక్కువుగా నమ్మేది వాస్తు శాస్త్రమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టగా.. ఏపీ సీఎం జగన్ సైతం తాడేపల్లిలోని తన నివాసంలో వాస్తు మార్పులు చేయించినట్లు తెలుస్తోంది. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండకపోవడానికి కారణం వాస్తు సమస్యేనంటూ కొందరు పండితులు చెప్పడంతో ఈ ఇద్దరు వాస్తులో మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
విజయవాడ: కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గపు చట్టంగా అభివర్ణించారు.
అమరావతి: జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తధ్యమని, కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయమని.. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం జిల్లాలోని పలమనేరులో సీఎం జగన్ సభ నిర్వహించారు. అయితే జగన్ సభకు హాజరైన ప్రజల్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సభకు వచ్చిన జనానికి వైసీపీ శ్రేణులు చల్లని పానీయాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తాగిన పలువురకి అనారోగ్యం పాలయ్యారు. వాంతులు అవడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.