Home » CM Jagan
జగన్ ప్రభుత్వ విధ్వంస పాలనకు ప్రతీకగా ‘ప్రజావేదిక’ శిథిలాలను అలాగే ఉంచాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. సరిగ్గా ఐదేళ్ల కిందట జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రజా వేదికను బుల్డోజర్లు, పొక్లెయిన్లతో జగన్ కూలగొట్టించిన విషయం తెలిసిందే.
మీడియా దిగ్గజం రామోజీరావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీ రావు మృతి వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగు మీడియా రంగానికి రామోజీ రావు ఎనలేని సేవలు అందించారని గుర్తుచేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనపై సమతా సైనిక్ దళ్ (Samata Sainik Dal) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలేటి ఉమామహేశ్వరరావు (Paleti Umamaheswara Rao), పిల్లి సురేంద్రబాబు (Pilli Surendra Babu) నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ అరాచక పాలన అంతమొందించడానికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిసికట్టుగా కృషి చేశారంటూ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి ఉమామహేశ్వరరావు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కొనసాగిస్తోంది. వాస్తవానికి రాయలసీమ వైసీపీకి అడ్డా. ఇప్పుడు ఇక్కడంతా టీడీపీ హవా నడుస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీ ముందంజలో ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కడప, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగులో టీడీపీ ముందంజలో ఉంది. బద్వేలులో వైసిపీ అభ్యర్థి 1483 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan)పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(Varla Ramaiah) సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల నోఫికేషన్ తర్వాతే సీఎం జగన్ రానున్న రూ.4వేల కోట్లతో కలిపి దాదాపు రూ.25వేల కోట్ల అప్పులు(25 Thousand Crore Loans) చేశారని తెలిపారు.
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) సుప్రీంలో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్పై సోమవారం సుప్రీంలో విచారణ జరగనుంది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరుగుతంది. పోస్టల్ బ్యాలెట్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కూటమి అధికారం చేపడుతుందని మెజార్టీ సంస్థలు స్పష్టం చేశాయి. విజయం తమదేనని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కానే కాదని తేల్చి చెబుతున్నారు. ఆ జాబితాలో మంత్రి ఆర్కే రోజా చేరారు.
మధ్యాహ్న భోజన పథకం విషయంలో జగన్ సర్కారుది ఆది నుంచీ ఆర్భాటమే! రోజురోజుకూ కొత్త రుచ్చులు అంటూ సాక్షాత్తూ సీఎం జగన్మోహన్రెడ్డే ప్రత్యేక మెనూ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నది కేవలం అన్నం పప్పుచారే అన్నది సుష్పష్టం. గుడ్లు వండి పెడుతున్నా కొన్ని పాఠశాలల్లో అదీ లేదు. వాస్తవానికి ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.8.57, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రూ.5.88 చొప్పున మెనూ ఖర్చు ఇస్తున్నారు.
లోకమంతా ఒకవైపు.. సీఎం జగన్ మరోవైపు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎగ్జిట్పోల్స్లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్, రైజ్ తదితర సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. ఊరూపేరూ లేని అనామక సంస్థలు వైసీపీయే అధికారంలోనికి వస్తుందంటూ ఇచ్చిన ఫలితాలను జగన్కు చెందిన చెందిన నీలి, కూలి మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందుతున్నారు. ఈ సంస్థలూ జగన్ చెప్పినట్లుగా 151 స్థానాలకు మించి వస్తాయని పేర్కొనలేదు