Home » CM Jagan
ఏపీలో పోలింగ్ టైమ్ దగ్గరపడింది. పొరుగూరు అంతా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఊరు నుంచి వచ్చిన ఓటర్ల దగ్గరకు వెళ్లి పార్టీ శ్రేణులు పలకరిస్తున్నారు. ప్రయాణం ఎలా జరిగింది. అంతా కులాశానేనా.. పని ఎలా నడుస్తుంది. ఆరోగ్యం బాగుందా అంతా అప్యాయంగా పలకరిస్తూ.. చివరిలో మన గుర్తు మర్చిపోకు.. మన పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు .
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన రోడ్ షో యావత్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించేందుకే కేటాయించారు. మేమంతా సిద్ధం పేరిట కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం ఆయన పర్యటించారు. భైరవాన తిప్ప ప్రాజెక్టుకు కృష్ణాజలాల తరలింపు, 114 చెరువులకు నీరు వంటి గత ఎన్నికల హామీలను విస్మరించిన ఆయన.. ఈ ఎన్నికల్లో వాటి ప్రస్థావనే తేలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తారో కూడా చెప్పలేదు. ‘మీ బిడ్డ మంచి చేసి ఉంటే చేతులెత్తండి’ అని పదే పదే వైసీపీ ...
ఐదేళ్ల జగన్ (CM Jagan) పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ (MA Sharif) తెలిపారు. తెలుగుదేశం పార్టీ పాలనలోనే ముస్లిం సమాజానికి సంక్షేమం, అభివృద్ధి జరిగిందని అన్నారు. ఓడిపోయే వైసీపీకి ఓటేసి మీ అమూల్యమైన ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఉత్తరాంధ్రాను మంత్రి బొత్స కుటుంబం దోచుకుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి బొత్స సత్తిబాబు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. . ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతిపరుడనే స్ధాయా బొత్సది? కాదని హితవు పలికారు.
Andhrapradesh: జగన్కు, కూటమికి ఓటు వేస్తే బీజేపీని గెలిపించినట్టే అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. బీసీ, దళిత, క్రైస్తవులు, ముస్లిం లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏడు నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీకి స్పందన అద్భుతంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీకి నాలుగు లక్షల ఓట్లు వస్తే...
Andhrapradesh: జిల్లాలోని బుట్టాయిగూడెం మండల టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు గురువారం సమావేశమయ్యారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, పోలవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు , టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. 72 శాతం పోలవరం ప్రాజెక్టును టీడీపీ పూర్తి చేస్తే.. జగన్ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని.. వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) అన్నారు. ముస్లిం వర్గాలు కూడా సీఎం జగన్ను నమ్మే పరిస్థితిలో లేరని.. వారికి అన్ని విధాలా అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. నిన్న(బుధవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షోలో కూడా ముస్లింలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు.
Andhrapradesh: అమరావతిపై సీఎం జగన్ రెడ్డికి సీతకన్ను అని కూటమి నేతలు మండిపడ్డారు. గురువారం కూటమి నేతలు వర్లరామయ్య, మాల్యాద్రి, లంకా దినకర్, యామిని శర్మ, శివశంకర్, అజయ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ... మూడు ముక్కలాటతో అమరావతిని జగన్ రెడ్డి విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతే రాజధాని అని కేంద్రం స్పష్టం చేసిందన్నారు.
కేశినేని చిన్ని (శివనాథ్ ) ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు క్యూలు కడుతున్నారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ , కార్యవర్గంతో సహా ఐదు వందల మంది నేడు టీడీపీలో చేరారు. వారికి కేశినేని చిన్ని పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Andhrapradesh: ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మళ్ళీ జగన్ లాంటి ముఖ్యమంత్రి రావొద్దని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలు గొడ్డలి తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఓటుతో జగన్కు సమాధానం చెప్పాలన్నారు.