Home » CID
కాకినాడ సీపోర్టులో వ్యాపారవేత్త కేవీ రావును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ వేగం పెంచింది.
కాకినాడ పోర్టును బెదిరించి లాగేసుకున్న వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. అరబిందో శరత్ చంద్రారెడ్డితోపాటు ఆడిటింగ్ కంపెనీ శ్రీధర్ అండ్ సంతానానికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.
కామవరపుకోట మండలం తడికలపూడి హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ నందిగం రాణి భర్త ధర్మరాజును రాజమండ్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. రూ.33 కోట్ల నగదు లావాదేవీల వ్యవహారంలో అధికారులు అతన్ని అరెస్టు చేయగా, ఆయన భార్య రాణి మాత్రం పరారీలో ఉన్నారు.
శాసనసభ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టయిన విశ్రాంత అదనపుల్ ఎస్పీ విజయ్పాల్ను విచారణ కోసం 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నగరంపాలెం(గుంటూరు) పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం తీర్పు వెలువడనుంది.
కాకినాడ పోర్టుకు సంబంధించి అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఎగుమతి చేస్తున్న బియ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల కాకినాడ పోర్టులో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను గుర్తించారు.
అమరావతి: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతోపాటు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్ చంద్ర రెడ్డిపై ఎల్వోసీ ఇచ్చింది. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా దేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు ఎల్వోసీలు పంపినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేయాలని హైకోర్టును సీఐడీ కోరింది.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషచం తెలిసిందే. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది.
మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హత్యకు వైసీపీ హయాంలో సీఐడీ కుట్ర చేసిందని పోలీసులు వెల్లడించారు. కస్టడీలో ఆయనను చిత్రహింసలకు గురిచేశారని, తాళ్లతో కాళ్లు కట్టేసి.. రబ్బర్ బెల్టు, లాఠీలతో తీవ్రంగా కొట్టారని తెలిపారు. దీనిపై జూన్ 10న గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్లో రఘురామ చేసిన ఫిర్యాదు...
స్కిల్ డెవల్పమెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనుక పెద్దకుట్ర జరిగిందని సీనియర్ ఐఏఎస్, నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ స్పష్టం చేశారు.