Home » CID
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(TDP chief Chandrababu Naidu) క్వాష్ పిటీషన్(Quash petition)పై సుప్రీంకోర్టు (Supreme Court) ఈరోజు విచారణ చేపట్టింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణకు రాగా.. తదుపరి విచారణను వచ్చే మంగళవారం(అక్టోబర్17) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ రికార్డుపై ఏసీబీ కోర్టులో (ACB COURT) విచారణ జరుగుతోంది.
ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో (ACB COURT) పీటీ వారెంట్పై ప్రభుత్వ న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు.
2వ రోజు టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) సీఐడీ (CID) విచారణ ముగిసింది.
విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పీటీ వారెంట్లపై రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. గత వారం రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్పై కోర్టు విచారణ నిర్వహించింది. పీటీ వారెంట్లపై విచారణ చేపట్టబోయే ముందు తమ వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ వేశారు.
రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో విచారణకు పిలిచిన సీఐడీ అధికారులు దానికి సంబంధించిన ప్రశ్న ఒకటి మాత్రమే అడిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తెలిపారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్.. సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పునీత్ను సీఐడీ అధికారులు విచారించనున్నారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరుగనుంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజూ సీఐడీ విచారణకు హాజరయ్యారు. చెప్పిన సమాయానికి కంటే ముందే లోకేష్ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విచారణ కొనసాగనుంది.
లోకేష్ను ఓ వైపు సీఐడీ అధికారులు విచారిస్తుండగా మరోవైపు విచారణ అధికారులకు ఒక్కటే ఫోన్లు, మెసేజ్లు వచ్చినట్లు తెలిసింది. ఒకసారి కాదు రెండుసార్లు కాదు మొత్తం..