Home » Chiranjeevi
వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులెవరూ టీడీపీలో ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బందరు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహానికి కేఏ పాల్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజి స్టార్కు 1000 కోట్లు ఇచ్చారని కాపులను టీడీపీకి అమ్మేశారన్నారు. 2009 లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారని కేఏ పాల్ పేర్కొన్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో..
మెగాస్టార్ చిరంజీవి తన అభిమాన కథానాయకుడని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvwada Ajay Kumar) అన్నారు.
మెగాస్టార్ చిరంజీవినీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యే కొడాలి నాని అన్న మాటలు వారి అభిమానులు ఎన్నటి కి మరువరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి వీళ్ళతో ఆ విధంగా తిట్టిస్తున్నాడని విమర్శించారు.
మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. ఇంత రచ్చ చేసిన కొడాలి నాని తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆశ్చర్యానికి గురిచేసింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇటీవల ‘భోళా శంకర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ‘భోళా’తో భారీగా నష్టపోయిన నిర్మాత అనిల్ సుంకరకు చిరు పారితోషికం వెనక్కి ఇచ్చి ఆదుకొన్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల చిరు మోకాలికి ఆపరేషన్ జరిగింది. ఇప్పుడాయన కోలుకొంటున్నారు. ఆగస్టు 22న పుట్టిన రోజు సందర్భంగా చిరు కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటన రావాల్సివుంది. అయితే..
బలమైన కాపు సామాజిక వర్గం నుంచి ఒకప్పుడు అన్వేషణ సాగించే వారు. ఇప్పుడు దానికి భిన్నంగా వైసీపీ బీసీల వేటకు దిగింది. పనిలో పనిగా ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఏ ఏ స్థాయిల్లో ఉన్నారో తెలుసుకునే ఆ దిశగా ఆరా తీస్తోంది. దీనిలో భాగంగా పార్టీలో చాన్నాళ్లుగా నానుతున్న పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జిగా కొత్త ముఖాన్ని రంగంలోకి దింపారు.
వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) తీసుకునే నిర్ణయాలు దరిద్రంగా ఉన్నాయని ప్రతిపక్షాల నోట ప్రతిరోజూ వింటూనే ఉన్నాం.!. పోనీ ఈసారైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందా..? అని ఆశించిన ప్రతిసారీ మరో చెత్త నిర్ణయం తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి..
కేసీఆర్ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే నిరాహారదీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిల్ వేస్తానన్నారు.