Home » Chiranjeevi
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా (నవ్యాంధ్రకు రెండోసారి) నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని గన్నవరం మండలం కేసరిపల్లిలో ఐటీ టవర్ వద్ద..
కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
రామోజీరావు లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు.
రామోజీరావులో అందరూ గాంభీర్యాన్ని చూస్తే నేను మాత్రం ఆయనలోని చిన్నపిల్లాడిని చూశా. నేను 2009లో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి సలహాల కోసం ఆయన్ను తరచూ కలిసేవాడిని.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విక్టరీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. ఎన్నికల్లో గడప గడపకు ప్రచారం చేశారు. జగన్ నిరంకుశ వైఖరి, గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపారు. దాంతో కూటమికి ప్రజలు పట్టం కట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో పొత్తు కుదుర్చుకున్న పవన్ కల్యాణ్.. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ(21) జయకేతనం ఎగురవేశారు. ఈ నేపథ్యంలో పవన్కు
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) అధికార వైసీపీ (YSRCP) మంత్రులు, క్యాబినేట్ అంతా ఓటమి చవి చూడనుందని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. అందుకే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారని చెప్పారు.
Telangana: సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం భార్య, పెద్ద కూతురు సుష్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చిరు వచ్చారు. క్యూ లైన్లో వేచి ఉండి మరీ మెగాస్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో చిరు మాట్లాడుతూ.. తమ్ముడు పవన్ కళ్యాణ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
రేపే ఎన్నికల పండుగ. సామాన్యులతో పాటు సెలబ్రిటీలంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెక్కడ వినియోగించుకోనున్నారంటే.. ఓబుల్రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్ .. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మహేశ్బాబు, నమ్రత , మంచు మోహన్బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, జీవిత, రాజశేఖర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.