Home » children
ఇప్పుడు ట్రెండ్ మారింది. పిల్లలకు సంబంధించి ఆట, పాటలు మారాయి. ఒకప్పటిలా నలుగురు కలిసి ఆడుకోవడం లేదు. అంతా మొబైల్ లేదంటే టీవీకి అతుక్కుపోతున్నారు. దాంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. చైనాలో ఓ తండ్రి మూడేళ్ల చిన్నారి పట్ల కఠినంగా వ్యవహరించాడు.
సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకరమైన రీతిలో ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో హీరో సాయి దుర్గాతేజ్ స్పందించారు. ‘పేరెంట్స్ అందరికీ నా విన్నపం ఇదే. పేరెంట్స్ అందరూ తమ పిల్లల ఫొటోలు సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బయట సోషల్ మీడియా ముసుగులో చాలా క్రూరమైన మృగాలు ఉన్నాయి.
మంచిర్యాల: జిల్లాలో ఓ పసివాడికి అరుదైన వ్యాధి సోకింది. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ వేస్తే తప్ప బాబు బతికే అవకాశం లేదని వైద్యులు తెలపడంతో బాలుని తల్లి దండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంత డబ్బు పెట్టి వైద్యం చేయించే స్తోమత లేక దాతల సహయం కోసం ఎదురుచూస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శ్రీ యుగపురుష్ దామ్ బౌదిక వికాస్ కేంద్రం పాఠశాలలో ముగ్గురు చిన్నారులు మరణించారు. మరో 12 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిని స్థానిక చాచా నెహ్రూ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
రాష్ట్రంలో వీధి కుక్కలు చిన్న పిల్లలను కరిచి చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు.
చిన్నారులకు మానసీక, శారీరక దృఢత్వానికి అంగనవాడీ కేంద్రాలు కృషి చేస్తున్నాయని ఐసీడీఎస్ సీడీపీఓ రెడ్డి రమణమ్మ పేర్కొన్నారు. మండలపరిధిలోని కొడికొండ అగనవాడీ కేంద్రంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న చిన్నారులకు శుక్రవారం ఘనంగా గ్యాడ్యుయేషన కార్యక్రమం నిర్వహించారు.
పిల్లలతో హోమ్వర్క్ చేయించటానికి తల్లితండ్రులు సతమతమయిపోతూ ఉంటారు. దగ్గరుండి చేయించలేక, ఆ వర్క్ తామే పూర్తి చేసి హమ్మయ్య...
చిన్నారుల భవిష్యత్తుకు, చదువులకు పునాది అంగనవాడీ కేంద్రాలు అని సీడీపీఓ రెడ్డిరమణమ్మ పే ర్కొన్నారు. పట్టణ పరిధిలోని కొల్లకుంట 1, 2 అంగనవాడీ కేంద్రాల్లో గురు వారం గ్రాడ్యుయేషనడేను నిర్వహించారు.
తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేయడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి, దారుణానికి పాల్పడిన వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.
రాత్రి మిల్లులో నిద్రిస్తుండగా కరెంట్ పోవడంతో ఉక్కబోత భరించలేక తమ ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆరుబయటకొచ్చి నిద్రకు ఉపక్రమించడమే ఆ దంపతుల తప్పయింది! తల్లి చుట్టూ చేతులేసి హాయిగా నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ దుండగుడు ఎత్తుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్-కాట్నపల్లి మధ్య రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఓ రైస్ మిల్లు వద్ద ఈ ఘోరం జరిగింది.