Home » Chief Minister
హేమంత్ సోరెన్ కూటమి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను 56 స్థానాలు గెలుచుకుని రెండోసారి కూడా అధికారాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 24 స్థానాలు సొంతం చేసుకుంది.
తన కుమారుడిని ఉప ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వంలో పదవులకు తాను దూరంగా ఉండాలని ఏక్నాథ్ షిండే చేస్తున్న ప్రతిపాదనతో సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందువల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని వారంటున్నారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా, అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పేనని, అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు(Supreme Court) తేల్చి చెప్పింది.
అక్టోబర్ 28న 29 మంది సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లు, అదనపు జిల్లా మెజిస్ట్రేట్లను బదిలీ చేయడం ద్వారా కుట్రకు బీజేపీ తెరతీసిందని అతిషి ఆరోపించారు. ఆ తర్వాత స్వల్వ వ్యవధిలోనే ఓటర్ల జాబితా నుంచి ఆప్ ఓటర్లను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చిందని, ఈ ఉత్తర్వులు నేరుగా ఎస్డీఎం కార్యాలయాల నుంచి వచ్చాయని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పాటు కోసం పార్టీల మధ్య చిచ్చుపెట్టడం, విడగొట్టడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని సంజయ్ రౌత్ ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ మెజారిటీకి కొన్ని సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నందున అధికారం వారి చేతిలో ఉందనే విషయాన్ని తాను అంగీకరిస్తారనని అన్నారు.
ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయంగా ఉందని, అయితే ఏక్నాథ్ షిండే సంతోషంగా లేరని, ఆయన అసంతృప్తిని తొలగించాల్సి ఉంటుందని రామదాస్ అథవాలే అన్నారు.
మహారాష్ట్ర కొత్త సీఎం రేసులో ఏక్నాథ్ షిండే ఉన్నారంటూ ఆయన వర్గం బలంగా చెబుతుండగా, మరోవైపు ఆయనపై ఉద్ధవ్ శివసేన వర్గం విమర్శలు ఎక్కుపెట్టింది. షిండే రాజకీయాల్లోంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది.
సీఎం రేసులో బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందంజలో ఉన్నారు. బీజేపీ పోటీ చేసిన 149 స్థానాల్లో 132 స్థానాలను ఆ పార్టీ గెలుచుకోవడంతో ఫడ్నవిస్కు మూడోసారి సీఎం పగ్గాలు అప్పగిస్తారనే వాదన బలంగా ఉంది. మరోవైపు సీఎం రేసులో ఏక్నాథ్ షిండే ఉన్నారని ఆ పార్టీ నేత సంజయ్ షిర్సత్ తెలిపారు.
షిండే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలు వెళ్తున్నామని బీజేపీ అధిష్ఠానం ముందుగానే ప్రకటించినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. దేవేంద్ర ఫడ్నవిస్కు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కీలక బాధ్యతలను బీజేపీ అప్పగించడం, అందుకు తగ్గట్టే ఆయన సమర్ధవంతంగా పార్టీని విజయపథంలో నిలపడంతో దేవేంద్ర ఫడ్నవిస్ చూపించిన చాణక్యం ఆ పార్టీ అధిష్ఠానం ప్రశంసలు అందుకుంటోంది.
ఈశాన్య ఢిల్లీలోని సుందర్ నగ్రిలో గత వారం హత్యకు గురైన 28 ఏళ్ల యువకుడి కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె ఢిల్లీలోని శాంతిభద్రతల పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. హతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.