Home » Chevireddy Bhaskar Reddy
సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతల్లో ఏ ఒక్కరికి లేదని అన్నారు. సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా గత ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వారిపై అమెరికాలోని న్యాయ స్థానం అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత తిరుపతి జిల్లాలో జరిగిన దాడులు అన్ని ఇన్ని కావు. మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి నాని (Pulivarthi Nani)పై.. వైసీపీ నుంచి బరిలోకి దిగిన చెవిరెడ్డి మోహిత్రెడ్డి, అతని అనుచరులు దాడికి తెగబడి కార్లను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నం చేశారు.
తిరుపతి: తన కుమారుడు మోహిత్ రెడ్డి వయస్సు 25 ఏళ్లు అని, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడని, సంఘటన జరిగిన 52 రోజుల తర్వాత రాజకీయ కక్షతో తన కుమారుడిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు..! ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే వైసీపీ నేతలు, అభ్యర్థులు విర్రవీగిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తించారు. ఆఖరికి టీడీపీ అభ్యర్థులపైన దాడులు చేసి..
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ భూములపై కన్నేశారు. ఓ ప్రైవేటు మాల్తో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు.
బాలినేని శ్రీనివాస్ (Balineni Srinivasa Reddy).. వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తారా..? ఇక పార్టీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారా..? వైఎస్ జగన్తో (YS Jagan) ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని.. కుమారుడితో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారా..? మూడో కంటికి తెలియకుండా లోలోపలే చర్చలు కూడా జరుగుతున్నాయా..? అంటే..
Andhrapradesh: చంద్రగిరి ఎన్నికల అధికారి నిషాంత్ రెడ్డిని మార్చకపోతే కౌంటింగ్లో అక్రమాలు జరుగుతాయని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వెనుక దారి చెవిరెడ్డి సొంత ఊరు తుమ్మలగుంటకు వెళుతుందన్నారు. అలా వెనుక ఒక గేట్ ఉందని.. దాని ద్వారా అక్రమంగా లోపలికి చొరబడవచ్చన్నారు.
పది రూపాయలకే రెండు క్వార్టర్ బాటిళ్లు.. యాభై రూపాయలకే బియ్యం బస్తా!.. ఓటమి భయంతో ఒంగోలు వైసీపీ అభ్యర్థులు ఓటర్లకు పంచుతున్న తాయిలాల పరంపర ఇది! ఒంగోలు లోక్సభ, అసెంబ్లీ వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలు ఓటమి భయంతో ఇప్పటికే అనేక రకాలుగా ఓటర్లను మభ్యపెట్టారు. ఇక పోలింగ్ దగ్గర పడడంతో ఓటుకు నోటుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో ఓటుకు రూ.3వేలు పంపిణీ చేశారు.
ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. రాష్ట్రంలో సైకో(జగన్) ఉంటే.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని విరుచుకుపడ్డారు.