Home » Chennai
తమిళ సీనియర్ నటుడు కరుణాస్ బ్యాగ్లో బుల్లెట్లు దొరకడం కలకలం రేగింది. చెన్నై నుంచి విమానంలో తిరుచ్చి వెళ్లేందుకు ఆయన చెన్నై ఎయిర్పోర్టుకు వెళ్లారు. విమానశ్రయంలో ఆయన లగేజీ తనఖి చేయగా బ్యాగ్లో బులెట్లను గుర్తించారు.
ఇండిగో విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్లో అత్యవసరంగా దించారు. అనంతరం విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఇవి నకిలీ బాంబు బెదిరింపు అని భద్రత సిబ్బంది నిర్ధారించారు..
తుది దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో 45 గంటల ధ్యానానికి కూర్చున్నారు.
త ప్రభుత్వం చేపట్టిన అక్రమ ఇసుక తవ్వకాల తాలూకు విపరిణామాలు ప్రస్తుత ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి. ఆదాయమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన ఇసుక తవ్వకాలపై ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల శాఖ, మైనింగ్ శాఖలకు చెనైలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ కోర్టు రూ.25 కోట్ల చొప్పున తాత్కాలిక జరిమానా విధించడం తెలిసిందే.
ఐపీఎల్ 2024(IPL 2024) 17వ సీజన్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఎందుకంటే కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియం(Chidambaram Stadium)లో సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చిదంబరం స్టేడియానికి క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రికెట్ లీగ్ ఐపీఎల్. 2008లో ప్రారంభమైన ఐపీఎల్(IPL 2024) ఈసారి 17వ సీజన్ లీగ్ జరుగుతోంది. నేటి ఫైనల్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్(KKR), సన్రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన, ఓడిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నై చిదంబరం స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు హైదరాబాద్ చేరుకున్నారు. హోటళ్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకుగాను పర్యావరణ కమిషన్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో క్లీన్/గ్రీన్ ఎనర్జీ కోసం పంప్డ్ స్టోరేజీ, సౌర, పవన, జలవిద్యుత్ ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తామని ప్రకటించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024) ఫైనల్ మ్యాచ్ సమయం రానే వచ్చింది. రేపు (మే 26న) సన్రైజర్స్ హైదరాబాద్(SRH), కోల్కతా నైట్ రైడర్స్(KKR) జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. చెన్నై(chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచి మళ్లీ చరిత్రను పునరావృతం చేసే మంచి ఛాన్స్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 చివరకు దశకు వచ్చేసింది. ఈ సీజన్లో ట్రోఫీని కైవసం చేసుకునేందుకు కోల్కతా నైట్ రైడర్స్(KKR), సన్రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు రేపు (మే 26) తలపడనున్నాయి. అయితే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉందా, ఉంటే ఎలా అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.