Home » Chandrayaan 3
చంద్రయాన్-3 విజయవంతమవడంతో ప్రపంచ చరిత్రలో భారత దేశ సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. ప్రతి భారతీయునికి గర్వకారణంగా నిలిచే ఈ విజయం యావత్తు మానవాళికి చెందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
చందమామపై భారత్ చెరగని ముద్రవేసింది. చరిత్రాత్మక ఘట్టంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తుండగా.. కోట్లాది భారతీయుల ప్రార్థనలు ఫలించగా.. రెండు రోజులక్రితం రష్యా లూనా-25 మిషన్ కుప్పకూలిన చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 మిషన్ ‘ల్యాండర్ విక్రమ్’ విజయవంతంగా సాఫ్ట్గా (Soft landing) లాండయ్యింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో..
జాబిల్లిపై భారత దేశ సింహాలు జూలు విదిల్చి గర్జించాయి. చంద్రుని దక్షిణ ధ్రువంలో మొట్టమొదటిసారి దిగిన ఘనత భారత దేశానికి దక్కింది. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారతీయులంతా సంబరాల్లో మునిగిపోయారు.
మరికొద్దిసేపట్లో చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో...
మరికాసేపట్లో భారత దేశ సింహాలు చంద్రునిపై గర్జించబోతున్నాయి. చంద్రయాన్-3 కార్యక్రమం అంతా సజావుగానే జరుగుతోందని, గతంలో సూచించినట్లుగా ప్లాన్-బీ వైపు ఆలోచించవలసి అవసరం లేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వర్గాలు తెలిపాయి.
చంద్రయాన్-3 కార్యక్రమంపై ప్రపంచమంతా దృష్టి పెట్టింది. భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలను; శక్తి, సామర్థ్యాలను చాటి చెప్తూ, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడే ఈ కార్యక్రమాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా దీని కోసం భారత్ చేస్తున్న ఖర్చు చర్చనీయాంశంగా మారింది.
చంద్రయాన్-3ని పర్యవేక్షిస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (European Space Agency-ESA) బుధవారం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి తమ సంస్థలో అన్ని వ్యవస్థలు సజావుగా ఉన్నట్లు తెలిపింది.
చంద్రయాన్-3 విజయవంతమయ్యే సమయం ఆసన్నమవుతోంది. మరికొద్ది గంటల్లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై అడుగు పెట్టబోతున్నాయి. అంతా సవ్యంగానే జరుగుతోందని, షెడ్యూలు ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతాయని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రకటించింది.
భారతీయుల కలలను సాకారం చేస్తూ చంద్రయాన్-3 దూసుకెళ్తోంది. భారత దేశాన్ని ప్రపంచంలో సమున్నత స్థానంలో నిలపబోతోంది. అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తల శ్రమకు ఫలితం రాబోతోంది. అంతా సవ్యంగానే జరుగుతోంది.