Home » Chandrayaan 3
భూమిపై చంద్రోదయం అయ్యే వేళలో చంద్రుడిపై ఓ నవోదయం! భారత కీర్తిచంద్రికలు ఆచంద్రతారార్కం నిలిచే మహాద్భుత ఘట్టం! మానవుడే మహనీయుడై గ్రహరాశులనధిగమించి.. మన ‘ప్రజ్ఞాన్’ పాటవాలను విశ్వవ్యాప్తం చేసిన చారిత్రక సన్నివేశం!
చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మహోన్నత ఘట్టంతో దేశమంతా గర్విస్తోందన్నారు. భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించామని పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన మోదీ.. బుధవారం విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగిన ఘట్టాన్ని
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి ల్యాండర్ మనదే కావడంతో ప్రపంచ దేశాలన్నీ ‘జయహో భారత్’ అని వేనోళ్లా కీర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్-3 ప్రయోగం గురించి ప్రశంసించబోయి రాజస్థాన్కు చెందిన క్రీడా శాఖా మంత్రి అశోక్ చంద్నా పరువు పోగొట్టుకున్నారు.
జాబిల్లిపై సురక్షితంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3కి సంబంధించి.. ఈ ఘనత సాధించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కమ్మని కబురు దేశ ప్రజలకు అందించింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్కు, బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంతో(MOX-ISTRAC) కమ్యూనికేషన్ లింక్ ఏర్పడినట్లు ట్విటర్ వేదికగా ఇస్రో వెల్లడించింది. అంతేకాదు.. ల్యాండర్ చంద్రుడిపై దిగాక తీసిన ఫొటోలను కూడా ట్విటర్లో పోస్ట్ చేసింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. 140 కోట్ల భారతీయుల కలల్ని సాకారం చేస్తూ.. ఇది బుధవారం సాయంత్రం 6:03 గంటలకు జాబిల్లిపై...
చంద్రుని దక్షణ ధృవంపై చంద్రయాన్-3 (Chandrayaan-3)విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల(ISRO scientists)కు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతం కావాలని కోరుకుంటూ చంద్రయాన్-3 కోసం అహర్నిశలు కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
చంద్రయాన్-3 విజయవంతం కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నెహ్రూజీకి ఉన్న శాస్త్రీయ దృక్కోణమే భారత పరిశోధనా సంస్థకు పునాది వేసిందని అన్నారు. ఇందుకోసం తొలినాళ్ల నుంచి చేసిన కృషి ఫలితమే ఈరోజు చంద్రయాన్-3 విజయమని ఆయన ట్వీట్ చేశారు.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. జాబిల్లిపై భారత్ జెండా పాతింది. అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగుపెట్టింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అయింది. 40 రోజులు ప్రయాణించి చంద్రయాన్-3 జాబిల్లిపై దిగింది. ఇప్పుడు ‘వాట్ నెక్ట్స్’ అనే ప్రశ్న చాలామందిలో ఉత్సుకత రేకెత్తిస్తోంది.
చంద్రయాన్-2 విజయవంతం కావడంపై కాంగ్రెస్ పార్టీ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఇది ప్రతి ఒక్క భారతీయుని సమష్టి విజయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ఈరోజు సాకారమయ్యాయని అన్నారు.
జాబిల్లి దక్షిణ ధృవంపై తొలి అడుగు వేసి చరిత్ర సృష్టించాలనుకుంటున్న చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 mision) ల్యాండర్ విక్రమ్ (Lander Vikram) సంసిద్ధంగా ఉన్న వేళ యావత్ భారతావని ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తోంది. అద్భుత ఘట్టంతో చరిత్ర సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శాస్త్రవేత్తలు టెన్షన్ టెన్షన్గా వేచిచూస్తున్నారు...