Home » Chandragiri
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఓట్లతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల ఓట్లను సైతం మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఉదయం 8.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
న్యూఢిల్లీ: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు.. ఆ తర్వాత జరిగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. మరోవైపు.. ఈ అల్లర్ల ఘటనపై విచారణ చేసేందుకు తాడిపత్రికి సిట్ అధికారుల బృందం విచ్చేసింది. శాంతిభద్రతల దృష్ట్యా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ను పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు...
Andhrapradesh: చంద్రగిరి ఎన్నికల అధికారి నిషాంత్ రెడ్డిని మార్చకపోతే కౌంటింగ్లో అక్రమాలు జరుగుతాయని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వెనుక దారి చెవిరెడ్డి సొంత ఊరు తుమ్మలగుంటకు వెళుతుందన్నారు. అలా వెనుక ఒక గేట్ ఉందని.. దాని ద్వారా అక్రమంగా లోపలికి చొరబడవచ్చన్నారు.
పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి.
Andhrapradesh: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి కల్పించాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అభ్యర్థికి 1+1 భద్రత కేటాయించాలని న్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది. తనకు భద్రత కల్పించాలంటూ ఎస్పీకి పులివర్తి నాని విజ్ఞప్తి చేశారు. అయితే ఎస్పీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో నాని హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు (సోమవారం) టీడీపీ అభ్యర్థి పిటిషన్పై విచారణ జరిగింది.
Andhrapradesh: ఒకేసారి టీడీపీ, వైసీపీకి చెందిన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఆర్డోవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టీడీపీ శ్రేణులపై రాళ్లు విసురుతూ అధికారపార్టీ శ్రేణులు రణరంగం సృష్టించారు. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి కాస్త సర్దుమణిగింది. ఇంతకీ ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. తిరుపతిలోనే.
AP Elections 2024: చంద్రగిరి నియోజకవర్గంలో(Chandragiri) అధికార వైసీపీకి(YCP) బిగ్ షాక్ తగిలింది. ఏళ్ల తరబడి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు.. టీడీపీలో(TDP) చేరారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని(Nani) ఆధ్వర్యంలో.. చంద్రబాబు(Chandrababu) సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు.
తిరుపతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఉదయం తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి పేరుతో యాత్ర ప్రారంభించారు. ముందుగా నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
అవును.. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయం తీసుకుంటా.. ఇవీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో (Chandrababu) భేటీ తర్వాత టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..