Home » Chandrababu
ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మొదటి నెల, రెండోనెలా తీసుకోకున్నా.. మూడో మాసంలో స్వేచ్ఛగా తీసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మొన్ననే ఆదేశాలు ఇచ్చానని..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం అంటే.. నవంబర్ 1వ తేదీన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలోని లబ్దిదారులు శాంతమ్మ కుటుంబానికి సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం శాంతమ్మ వంటింటిలోకి వెళ్లి సీఎం చంద్రబాబు టీ పెట్టారు.
‘స్వర్ణాంధ్ర - 2047’ సాధనకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 12 సూత్రాలను నిర్దేశించారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కొత్త పాలక మండలిని నియమించారు. మొత్తం 24 మందితో టీటీడీ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తెలుగుదేశంపార్టీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని, టీడీపీ ఒక రాజకీయ యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్వే లైన్ కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని మోదీ .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు తాను ఉండగా సాంకేతికతలో ఇండియాను ఎవరూ తాకలేరని, ఆంధ్రప్రదేశ్ను ఎవరూ ఆపలేరని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం రాజధాని అమరావతి ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే రాజధాని అమరావతిలో పున: నిర్మాణ పనులకు శనివారం సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందులోభాగంగా తుళ్లూరు మండలం ఉద్దరాయునిపాలెంలోని సీఆర్డీయే కార్యాలయం వద్ద భూమి పూజ నిర్వహించారు. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు ఊపందుకొనున్నాయి.
అదృశ్యమైన 30 మంది మహిళలకు గుర్తించి.. వారిని స్వస్థలాలకు తీసుకు వచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చూట్టింది. విశాఖపట్నంలోని శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా అప్పగించిన వందల కోట్ల విలువైన 15 ఎకరాల భూమి కేటాయింపును సైతం రద్దు చేసింది. ఈ తరహా అక్రమాలపై కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తూ.. ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అండ్ కో తట్టుకో లేకపోతుంది.
సహకార సంఘాలకు ముగ్గురు సభ్యుల నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.