• Home » Chandrababu

Chandrababu

CM Chandrababu: 5 కోట్ల ప్రజల మనిషిని.. రాష్ట్రాభివృద్ధే నా లక్ష్యం: చంద్రబాబు

CM Chandrababu: 5 కోట్ల ప్రజల మనిషిని.. రాష్ట్రాభివృద్ధే నా లక్ష్యం: చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశుని దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీవారి ఆశీస్సుల కారణంగానే తమ కూటమి విజయం సాధించిందన్నారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని.. 93 శాతం స్ట్రైక్ రేట్ గతంలో ఎప్పుడూ రాలేదన్నారు చంద్రబాబు.

AP News: అసెంబ్లీ సమావేశాల కోసం ముస్తాబవుతున్న వివిధ పార్టీల కార్యాలయాలు

AP News: అసెంబ్లీ సమావేశాల కోసం ముస్తాబవుతున్న వివిధ పార్టీల కార్యాలయాలు

ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. ఒక రోజు అటో ఇటో సమావేశాలైతే నాలుగైదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల కోసం వివిధ పార్టీల కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. జనసేన పార్టీకి కొత్తగా జేఏఎస్ఎల్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచి టీడీఎల్పీ కేటాయించిన కార్యాలయాన్ని జేఎస్ఎల్పీకి కేటాయించడం జరిగింది.

AP CID: మద్యం కేసులో ఏపీ సీఐడీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా లక్ష్మీనారాయణ

AP CID: మద్యం కేసులో ఏపీ సీఐడీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా లక్ష్మీనారాయణ

అధికారం చేపట్టగానే ఏపీలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు పూనుకుంది. మద్యం కేసులో ఏపీ సీఐడీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎం. లక్ష్మీనారాయణను నియమించింది. సీనియర్ కౌన్సిల్‌గా పోసాని వెంకటేశ్వర్లును నియమిస్తూ జీవో నంబర్ 578ను విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న ప్రమాణ స్వీకారానంతరం ఆయన తన కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లారు. అటు తరువాత వైకుంఠం ద్వారా చంద్రబాబు ఆలయంలోకి ప్రవేశించనున్నారు. సంప్రదాయ వస్త్ర ధారణతో చంద్రబాబు,లోకేష్,దేవాన్ష్ శ్రీవారి దర్శనానికి వచ్చారు.

AP News: నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

AP News: నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

విద్యార్థులకు వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జగనన్న విద్యాకానుక స్థానంలో ‘స్టూడెంట్‌ కిట్స్‌’ అందించనున్నారు. ఇంకా పాఠ్య పుస్తకాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. వాస్తవానికి నిన్నటి నుంచే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది.

Payyavula Keshav: నమ్మకాన్నీ వమ్ము కానీయం

Payyavula Keshav: నమ్మకాన్నీ వమ్ము కానీయం

తనకు మంత్రి పదవి రావడంతో తన బాధ్యత మరింత పెంచిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్సష్టం చేశారు. ఈ సమాజానికి తిరిగి తాము ఏం చేయగలమనే ఆలోచనతోనే ఈ రోజు తమ ప్రస్థానం మొదలవుతుందని తెలిపారు.

AP CM: తిరుమలకు చంద్రబాబు

AP CM: తిరుమలకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మరికాసేపట్లో తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరనున్నారు.

Chandrababu Swear-in: చంద్రబాబుకి అమిత్ షా.. పవన్‌కి చిరంజీవి ప్రత్యేక అభినందనలు

Chandrababu Swear-in: చంద్రబాబుకి అమిత్ షా.. పవన్‌కి చిరంజీవి ప్రత్యేక అభినందనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా తమ విషెస్‌ను తెలియజేస్తున్నారు.

AP Cabinet: మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఆసక్తి.. జనసేన డిమాండ్ చేస్తున్నవి ఇవే..!

AP Cabinet: మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఆసక్తి.. జనసేన డిమాండ్ చేస్తున్నవి ఇవే..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మిగిలింది ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. కీలక శాఖలను ఎవరికి ఇస్తారు.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది.

Chandrababu Naidu swearing in: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

Chandrababu Naidu swearing in: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

AP CM Chandrababu Naidu Swearing in Ceremony Live News Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి