Home » Chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ శుక్రవారం భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై ఇరువరు చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైంది. రేపు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ (శుక్రవారం) సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.
రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు. దేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందామన్నారు. 2014-19 మధ్య కాలంలో టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచామన్నారు.
సీఎం చంద్రబాబుపై ఉన్న 7 కేసులను సీబీఐకు అప్పగించాలని వేసిన పిటిషన్పై హైకోర్ట్లో విచారణ జరిగింది. పిటిషన్ విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్ అభ్యంతరం లేవనెత్తారు. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ చెప్పారు.
ఏపీ అసెంబీ సెషన్ (AP Assembly Session) 5వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఏపీ ప్రజలు కూటమికే ఓటేశారు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు కట్టబెట్టి అధికారమిచ్చారు. పేరుగాంచిన ప్రాంతీయ, జాతీయ మీడియా.. సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువే సీట్లు దక్కాయని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఇక ఎక్కడా చూసినా పసుపు జెండాలే రెపరెపలాడుతున్నాయి.
ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేయనున్న కూటమి అభ్యర్థిపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు కసరత్తు ప్రారంభించినప్పటికీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (గురువారం) పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan) పూర్తి విభిన్నం. ప్రజలు అధికారం కట్టబెడితే ఐదేళ్లపాటు పరదాల చాటున తిరిగారు వైసీపీ అధినేత. కానీ చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా ప్రజల మధ్య, ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.